ఆస్పత్రి పాలైన శ్రేయాస్ అయ్యర్.. అంతర్గత రక్తస్రావం.. పక్కటెముకలో గాయం

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (12:04 IST)
Shreyas Iyer
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో  శ్రేయాస్ సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. 
 
ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేయడానికి బ్యాక్‌వర్డ్ పాయింట్ నుండి వెనుకకు పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు అయ్యర్. ఈ ప్రక్రియలో అతని ఎడమ పక్కటెముకకు గాయమైనట్లు కనిపించాడు. శనివారం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే టీం డాక్టర్, ఫిజియో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 
 
రెండు రోజుల పాటు శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రిలో వున్నాడు. అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. మొదట్లో అయ్యర్ దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటారని భావించారు. కానీ గాయం పెద్దది కావడంతో ఇప్పుడు కోలుకునే కాలం ఎక్కువ కావచ్చని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments