కర్నాటక బై పోల్ : కాంగ్రెస్‌లో ప్రకంపనలు... రాజీనామాల పర్వం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (18:19 IST)
కర్నాటక రాష్ట్రంలో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు. మొత్తం 15 స్థానాలకుగాను 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 
 
ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపింది. ఫలితంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత (సీఎల్సీ) పదవికి రాజీనామా చేశారు.
 
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును కాంగ్రెస్ పక్ష నేతగా తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని... రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించానని తెలిపారు. 
 
అలాగే, రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దినేష్ గుండూరావు ప్రకటించారు. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
 
తాజాగా గుండూరావు కూడా ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపించినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments