నటుడిగా నా పని అయిపోయింది : అమీర్ ఖాన్

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (13:09 IST)
సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారుల కోసం బాలీవుడ్‌ చిత్రం 'లాపతా లేడీస్' ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రముఖ నటులు ఆమిర్‌ ఖాన్‌, దర్శకురాలు కిరణ్‌రావు కూడా హాజరయ్యారు. లింగ సమానత్వాన్ని చాటి చెప్పే ఉదంతంతో విడుదలైన 'లాపతా లేడీస్' మూవీని బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించారు. 
 
2023లో 124 నిమిషాల నిడివిలో తీసిన ఈ హిందీ సినిమా‌ను లిమిటెడ్ బడ్జెట్‌లో అమీర్ ఖాన్ నిర్మించగా.. రూ.21.65 కోట్లు వసూలు చేసింది. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా కథని ఎంచుకుని, కామెడీ డ్రామాగా దీనిని కిరణ్ రావు తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'లాపతా లేడీస్‌' స్ట్రీమింగ్ చేయగ అత్యధిక వ్యూస్ రాబట్టి టాప్ వన్‌లో నిలిచి మంచి స్పందన రాబట్టుకుంది. ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలో ఈ సినిమా  ప్రదర్శించగా కమిటీ సభ్యుల నుండి ప్రశంసలు దక్కించుకుంది..
 
ఇక అమీర్ ఖాన్ ఈ సినిమా స్క్రీనింగ్‌లో కీలక వాఖ్యలు చేసారు. కోవిడ్ టైమ్‌లో ఖాళీగా ఉన్నప్పుడు నటుడిగా నా పని అయిపోయిందనిపించింది. ఇంకా పది పదిహేనేళ్లు అది కూడా హీరోగా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేయగలను. కానీ నిర్మాతగా మంచి సినిమాలను అందించవచ్చు కదా అని నిర్ణయించుకున్నాను. దేశం‌, సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా కొత్త వారికి, కంటెంట్ ప్రోత్సహించాలనుకున్నాను. ఆ ప్రయత్నంలోనే 'లాపతా లేడీస్‌'ను నిర్మించినట్లు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments