దొంగలకి పాఠం కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా చౌర్య పాఠం వుంటోందని దర్శకుడు, ఈ చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన అన్నారు. క్రైమ్-కామెడీ డ్రామా తో మూవీ రూపొందింది. ఇంద్రా రామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్లైన్. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.
కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు పాశవికంగా పర్యాటకులపై కాల్పులు జరిపిన 25 మందిని హతమార్చారు. ఈ ఉగ్ర చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ బాక్సుతో లోనికి వెళుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుధీర్ అత్తవర్తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్పీరియెన్స్ గురించి పంచుకున్నారు.
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత సినిమాటోగ్రాఫర్ శామ్దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.
కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడి ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పైగా, వివిధ కారణాలతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పౌరులంతా 48 గంటల్లో తమ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అలాగే, భారత్లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయ దౌత్య సిబ్బంది కూడా మే నెల ఒకటో తేదీలోపు దేశాన్ని వీడాలని కోరింది.
పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత కాశ్మీర్ నుంచి కేవలం 6 గంటల్లో 3300 మంది పర్యాటకులు వెళ్లిపోయారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. పహల్గామ్లోని బైసరన్ లోయలో భీకర ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసిందని, దీంతో వందల సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్ను వీడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన భరత్ భూషణ్ ఉన్నారు. ఈయన గడిపిన ఆఖరు క్షణాలను ఆయన భార్య వెల్లడించారు. భర్త భరత్ భూషణ్ మరణాన్ని అతి సమీపం నుంచి చూసిన భార్య సుజాత అంతులేని వేదనకు గురవుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీన తన కళ్లముందు జరిగిన విషాదాన్ని తనను ఓదార్చేందుకు వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు వివరించారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ నటి ఇమాన్వి సుధీర్ఘ వివరణ ఇచ్చింది. ముందుగా, పహల్గామ్లో జరిగిన విషాద సంఘటనకు నా అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తమ ప్రాణాలను మరియు వారి ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా హృదయం విలపిస్తుంది. అమాయక ప్రాణాలను కోల్పోవడం విషాదకరం మరియు నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నగరానికి చెందిన ఒక వ్యక్తి తనను మోసం చేసి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ గురువారం ఒక మహిళ ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంకు చెందిన 26 ఏళ్ల మహిళ ఇన్స్టాగ్రామ్లో మురళీ కిరణ్ నివాసి అయిన అనుమానితుడు మురళీ కిరణ్తో స్నేహం చేసింది. అతను ఆమెకు ప్రేమ ప్రపోజ్ చేశాడు. ఆమె దానిని అంగీకరించింది. అప్పటి నుండి, వారు అనేక సందర్భాలలో కలుసుకున్నారు.
పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ జంటగా నటించిన "అబీర్ గులాల్" చిత్రంపై కేంద్రం నిషేధం విధించింది. కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో ఉగ్రవాదులు ఈ నెల 22వ తేదీన దాడికి తెగబడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశీయంగా పాకిస్థాన్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, పాకిస్థాన్పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. ఇందులోభాగంగా, వచ్చే నెల 9వ తేదీన అబీర్ గులాల్ విడుదలకానుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చిత్రంపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. దీంతో కేంద్రం కన్నెర్రజేసింది. ఈ సినిమా భారత్లో విడుదలకాకుండా నిషేధం విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కర్రెగుట్ట కొండలపై గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్ల మరణాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. అయితే భద్రతా దళాలు 'ఆపరేషన్ కాగర్'లో భాగంగా మావోయిస్టులపై భారీ దాడి ప్రారంభించినందున నక్సలైట్ల వైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా కర్రెగుట్ట అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్ ఇప్పుడు ఆఫ్ లైన్ లోకి తీసుకొచ్చారు. రౌడీ వేర్ ఫస్ట్ ఆఫ్ లైన్ స్టోర్ ను హైదరాబాదులో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. బంజారాహిల్స్ బ్రాడ్ వేలో రౌడీ వేర్ స్టోర్ ఓపెన్ చేశారు.
కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గామ్ ఉగ్ర దాడిని ప్రస్తావించారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరులు భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) నడుపుతున్న బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ సంఘటన ఏప్రిల్ 14న జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాలిక తండ్రి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, బస్సు సిబ్బంది అధికారిక అనుమతి లేకుండా అనధికార ప్రయాణికులను బస్సు ఎక్కడానికి అనుమతించారని ఆరోపించారు. ఇంకా, సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తండ్రి పేర్కొన్నారు. ఈ అమానవీయ సంఘటన, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జవాబుదారీతనం లోపాన్ని విమర్శించారు.
కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశమే కాదు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. కానీ, దాయాది దేశమైన పాకిస్థాన్ మాత్రం ఈ దాడిపై ఇంతవరకు నోరు మెదపలేదు. ఈ దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్తో సంబంధాలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అదేసమయంలో పాకిస్థాన్ నటీనటులు భారతీయ చిత్రాల్లో నటించడానికి వీల్లేదంటూ నెట్టింట షేర్ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇమాన్వీ ఎస్మాయిల్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు.
హిందూపూర్లోని ఒక స్థానిక మహిళ తన పొరుగు వ్యక్తి, మరో ఇద్దరు తన కుమార్తె నగ్న వీడియోను ఉపయోగించి తనను దోపిడీ చేశారని ఆరోపించింది. వీడియోను బయటపెడతానని బెదిరించి దాదాపు రూ.60 లక్షలు చెల్లించాలని బలవంతం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఫిర్యాదు ప్రకారం, ఆ మహిళ హిందూపూర్లోని మేలాపురంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసిస్తుంది. ఆమె పొరుగున ఉన్న కె. జయలక్ష్మితో స్నేహపూర్వక సంబంధాన్ని పెంచుకుంది. కాలక్రమేణా, జయలక్ష్మి తన కుమార్తె నగ్న వీడియోను చూశానని, అది గుర్తుతెలియని వ్యక్తుల వద్ద ఉందని ఆరోపిస్తూ ఆ మహిళను సంప్రదించిందని ఆరోపణలు ఉన్నాయి.
పహల్గమ్ ఉగ్రదాడి వెనుకున్న పాకిస్థాన్ భారత్ మరో షాకిచ్చింది. భారత్లో పాక్ ప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్పై సస్పెన్షన్ వేటు వేసింది. అకౌంట్ను నిరవధికంగా నిలుపుదల చేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ ఖాతాను భారత్లో నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎక్స్ పాక్ ప్రభుత్వ ఖాతాను భారత్లో సస్పెండ్ చేసింది. దీంతో అందులోని కంటెంట్ను ఇక్కడి యూజర్లు చూడలేరు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా భావించే పహల్గామ్లోని పర్యాటక అందాలను తిలకిస్తున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మరోవైపు, దేశంలో మరోమారు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన తర్వాత, అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జనరల్ అసిమ్ మునీర్, అల్-ఖైదా మాజీ చీఫ్, క్రూరమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మధ్య చాలా తక్కువ తేడా ఉందని మైఖేల్ రూబిన్ ఆరోపించారు. "ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు గుహ నుండి కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఒక విలాసవంతమైన రాజభవనంలో నివసిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న ఏకైక ముఖ్యమైన తేడా అదే" అని రూబిన్ పేర్కొన్నాడు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు నటీనటులకు మద్దతు ఇచ్చే, వారి చిత్రాల్లో నటించే భారత నటీనటులకు నెటిజన్లు బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో పాక్ నటులు ఉన్న చిత్రాలను ప్రమోట్ చేసేందుకు వణికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి వాణి కపూర్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. పాకిస్థాన్కు చెందిన హీరో ఫవాద్ ఖాన్ నటించిన చిత్రాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో ప్రమోట్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ మూవీ పోస్టర్ను డిలీట్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముందు ఇపుడు పెద్ద సమస్య వచ్చిపడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్గా పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇమాన్విని ఎంపిక చేశారు. ఇదే ఇపుడు సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదులు పాశవికదాడికి పాల్పడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో పాకిస్థాన్పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతిని కేవలం రాజధాని నగరంగానే కాకుండా, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని మునుపటి అంచనాలకు మించి అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా మార్చి, జాతీయ రహదారుల ద్వారా భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానించడం లక్ష్యం.
ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ మరోమారు ఓడిపోయింది. ఇది ఆ జట్టుకు ఆరో ఓటమి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ నిర్ణయించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని 15.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇందులో రోహిత్ శర్మ (70), సూర్య కుమార్ యాదవ్ (40) చొప్పున పరుగులు చేశాడు.
భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు టీ20ల్లో అరుదైన రికార్డును నెలకొల్పారు. స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో హైదరాబాద్ను ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 70 పరుగులు చేసిన రోహిత్... ఈ క్రమంలో టీ20ల్లో 12 వేల పరుగుల ఫీట్ను పూర్తి చేశాడు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఈ అరుదైన ఫీట్ను సాధించిన రెండో భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అలాగే, భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న భారత బౌలర్గా రికార్డు సాధించాడు.
జమ్మూకాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రత సిబ్బంది అలర్ట్ చేసింది. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను సేకరిస్తోంది సెక్యూరిటీ సిబ్బంది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసింది సెక్యూరిటీ సిబ్బంది.
ప్రియదర్శి హీరోగా, రూపా కొడవయూర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఈనెల 25వ విడుదలకాబోతుంది. ఇప్పటికే రోజుకోచోట ప్రమోషన్ కు చిత్రం టీమ్ వెళుతున్నారు. నిన్ననే విజయవాడలో సుబ్బయ్య హోటల్ తో పాటు పలుప్రాంతాలను పర్యటించారు. బుధవారం నాడు టీం అంతా కూడా విజయవాడలో సందడి చేసింది. ‘సారంగపాణి జాతకం’ టీం దుర్గమ్మని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంది.
హిట్ 3 ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలలో నాని మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ OG కారణంగా ఇది ఆలస్యమైంది. సుజీత్ తో నా సినిమా ఆలస్యమైంది ఎందుకంటే అతను నా సినిమా ప్రారంభించడానికి ముందు OGని పూర్తి చేయాలి. అతను దానిపై పని చేస్తున్నాడు. ఇది ఎక్కువగా ది ప్యారడైజ్ తర్వాత ప్రారంభమవుతుంది. ఇంతకుముందు సుజిత్ ప్రభాస్ తో సాహో చేశాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ నాగసాధును హైదరాబాద్ మోకిలా పోలీసులు మోసం కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే, అఘోరీకి సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో అఘోరీని సంగారెడడి జిల్లా కంది సబ్ జైలుకు పోలీసులు తరలించగా, ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్లోనూ ఉంచలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు.
కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాన్-ఇండియా నటుడు ప్రభాస్ నటించి, హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో కథానాయికగా ఎంపికైన కొత్త నటి ఇమాన్వి, సోషల్ మీడియా వివాదానికి కేంద్రబిందువుగా మారింది.పహల్గామ్లో జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని, ఫలితంగా దాదాపు 28 మంది అమాయకులు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటనలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ప్రమేయం ఉందని వర్గాలు ఆరోపించాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ ఫలితంతో సంబంధంలేకుండా వెంటనే మరో సినిమాకు సిద్ధమయ్యాడు. యాక్సన్ డ్రామా చిత్రంగా తీసిన అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇందుకు రకరకాల కారణాలున్నా, ఇప్పుడు చేయబోయే సినిమాను పటాస్ తరహాలో ఎంటర్ టైన్ మెంట్ వేలో తీయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు. కాగా, గిరీశయ్య అనే డైరక్టర్ కళ్యాణ్ రామ్కు ఓ కథను చెప్పినట్లు తెలుస్తోంది. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో అర్జున్ రెడ్డిని రీమేక్ చేశాడు గిరీశయ్య.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావాలని, దేవుడిని ఆయన అసలు రూపంలో దర్శించుకుని అప్పన్న స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని భావిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ దేశానికి చెందిన హిందూ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ పాత్ర లేదా ప్రమేయం లేకపోతే, ఆ దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా, దాడి తర్వాత సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనిక బలగాలను ఎందుకు మొహరిస్తున్నారని, ఎందుకు అప్రమత్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు డానిష్ కనేరియా తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
వైకాపా మహిళా నేత, ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజినిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు గోపిని అరెస్టు చేశారు.
ఏకాదశి అనేది విష్ణువుకు అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది, శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ ఏకాదశి వస్తుంది. వరూథిని ఏకాదశి అనేది ముఖ్యమైన ఏకాదశి పండుగలలో ఒకటి. ఇది చైత్ర లేదా వైశాఖలో కృష్ణ పక్షం 11వ రోజున జరుపుకుంటారు. వరూధిని ఏకాదశి విష్ణువు వామన అవతారానికి అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజును ఉత్తర భారతదేశంలో వైశాఖ మాసంలో పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో, ఈ రోజును చైత్ర మాసంలో పాటిస్తారు. ఈ రోజున ఎవరికైనా లేదా బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ధాన్యం దానం చేసినా అద్భుత ఫలితాలు ఉంటాయి.
జీవితంలో ఏదైనా సాధించాలన్న అకుంఠిత దీక్ష ఉంటే, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని, నమ్మకం ఉంటే అనుకున్నది సాధించేవరకు పట్టువిడవకూడదని తెలుగు తేజం సాయి చైతన్య నిరూపించాడు. సివిల్స్ పోటీ పరీక్షల్లో ఐదుసార్లు విఫలమైనప్పటికీ ఆరోసారి ప్రయత్నంలో విజయం సాధించాడు. ఫలితంగా జాతీయ స్థాయిలో 68వ ర్యాంకును సాధించాడు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం అధికారికంగా ప్రటించింది. ఈ దాడి తర్వాత జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు, జమ్మూకాశ్మీర్లో దాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో జమ్మూకాశ్మీర్లో హై అలెర్ట్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపుడ్ జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లయిన 15 రోజులకే... మరోమారు ముగ్గురు తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాబుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన మహిళకు గజల్పుర్ వాసి నవీన్తో ఫిబ్రవరి 16వ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్ వివాహేతర సంబంధం ఉన్నట్టు భార్యకు తెలిసింది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన నవీన్కు నిర్మలతో రెండో పెళ్లి జరిగింది.
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందం 1960ని రద్దు చేసింది. ఈ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు తక్షణమే మూసివేత. సరైన ధృవపత్రాలతో భారత్కు వచ్చినవాళ్లే మే ఒకటో తేదీలోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
హైదరాబాద్: ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ విమానయాన అకాడమీలలో ఒకటైన BAA ట్రైనింగ్, ఏప్రిల్ 26, శనివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు హైదరాబాద్లో తమ పైలట్ ఓరియంటేషన్ దినోత్సవాన్ని నిర్వహించనుంది. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ బంజారా హిల్స్ 8-2-409, రోడ్ నెం.6, గ్రీన్ వ్యాలీ, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034 వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు.
జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నార్వాల్ తన భార్య హిమాన్షితో కలిసి పాకిస్తానీ పాటకు నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కొత్తగా పెళ్లయిన ఈ జంట ఒక అందమైన దృశ్యం నెటిజన్లను కట్టిపారేసింది. ఈ జంట ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. ఇది వినయ్ నర్వాల్ చివరి వీడియోగా మిగిలిపోయింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన, నీచమైన ఉగ్రవాద చర్యను ఆధ్యాత్మిక గురువు-ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం ఖండించారు. ఉగ్రవాదులను, అటువంటి శక్తులను ఉక్కు హస్తంతో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కోరారు.పహల్గామ్లోని బైసరన్లో భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న మెరుపుదాడిలో దారుణంగా మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సద్గురు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసేందుకు శుభం. ఈ రోజున ఎటువంటి శుభ కార్యాలు చేయడానికి ప్రత్యేక శుభ సమయం అవసరం లేదు. 'అక్షయం' అంటే నాశనం కానిది, శాశ్వతమైనది. ఈ రోజున చేసే శుభ కార్యాల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని రెట్లు పెరిగి శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ ఏప్రిల్ 30, 2025న వస్తుంది. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ అనేక ప్రత్యేక యోగాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. ఈ రోజున అనేక అరుదైన, అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఇది సంపద, శ్రేయస్సు,కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున చతుర్గ్రాహి యోగం, మాలవ్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, గజకేసరి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి యోగాలు ఏర్పడతాయి.
తులసి అనేది దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన మొక్క. తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉండటమే కాకుండా, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా, ఇది ఆరోగ్యానికి, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ అలెర్జీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది చర్మానికి ఒక వరం లాంటిది.
పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు పాటిస్తుందని ప్రకటించారు."పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి గౌరవార్థం, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలను పాటిస్తుంది. మేము మా పార్టీ జెండాను అవనతం చేస్తున్నాము" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సవాలుతో కూడిన సమయంలో ఐక్యతకు పిలుపునిస్తూ, ఏ ఉగ్రవాద చర్య కూడా భారతదేశ ఐక్యతను నాశనం చేయలేదన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భాగంగా ఉగ్రవాదులు తమ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకున్నారో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఉగ్రవాదులు పర్యాటకుల ఐడి కార్డులను తనిఖీ చేసి, వారు హిందువులా కాదా అని నిర్ధారించుకుని, ఆపై కాల్పులు జరిపారు. అయితే, ఉగ్రవాద దాడి మధ్య, పోనీ రైడ్ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదులతో తిరిగి పోరాడాడు.
జమ్మూ: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని టాంగ్మార్గ్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అనుమానాస్పద కార్యకలాపాల గురించి నిర్దిష్ట సమాచారం అందిన తర్వాత గట్టి వలయం ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.సోదాల సమయంలో భద్రతా దళాలపై భారీ కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీనితో ఎన్కౌంటర్ ప్రారంభమైందని, భారీ కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అదనపు బలగాలను పంపించాయి. మరింత సమాచారం అందాల్సి వుంది.
తమన్నా భాటియా లేటెస్ట్ మూవీ 'ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్' కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా చేయగా ఏప్రిల్ 17న విడుదలై టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర పోషించిన యాక్టర్ వశిష్ఠ ఎన్. సింహ పలు విషయాలు తెలియజేశారు.