Shorts

తెలంగాణలో జనసేన కార్యకర్తల సమావేశానికి అడ్డు తగలడమే కాకుండా మీడియా సమావేశానికి కూడా మోకాలడ్డిన తెలంగాణలోని కొందరు నాయకుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమ తెలంగాణ జనసేన నాయకుల కోరిక మేరకు తను అక్కడికి వెళ్లి దిశానిర్దేశం చేద్దామని అనుకున్నాననీ, ఐతే కొందరు నాయకులు తెలంగాణ వచ్చి పుష్కర కాలం దాటినా ఇంకా ద్వేషంతో నిండి వుండటం చూసి షాక్ తిన్నానంటూ వ్యాఖ్యానించారు. కాగా పవన్ కల్యాణ్ సమావేశాన్ని అడ్డుకోవడంపై భాజపా, తెదేపా తప్పుబట్టాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చనీ, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వెల్లడించాయి.

సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.

ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. 21 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. ఐతే పరుపుల వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, ఆయన కుమారుడు అర్మాన్ తీసుకున్న నిర్ణయంతో వారు 8మంది ప్రాణాలను కాపాడగలగడమే కాకుండా హోటల్ పైఅంతస్తుల నుంచి కిందికి దూకినవారికి తీవ్ర గాయాలు కాకుండా చేసింది. రియాజుద్దీన్, అర్మాన్ మానవత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు.మంటల్లో చిక్కుకున్న భవనంలో బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీలు, బాల్కనీల నుండి దూకవలసి వచ్చినప్పుడు, రియాజుద్దీన్ తన దుకాణంలోని సుమారు 20 నుండి 25 పరుపులు కింద పరిచాడు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న తాను సైకిల్ తొక్కుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఒక సందేశంలో, పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు సైకిళ్లు, ఈ-సైకిళ్లను (విద్యుత్ సైకిళ్లను) వినియోగించాలని ముఖ్యమంత్రి కోరారు. శుక్రవారం విశాఖపట్నంలో పర్యటన సందర్భంగా, తాను సైకిల్‌పై ప్రయాణిస్తూ, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అందరూ ఏకం కావాలని, తనకు సహకారం అందించాలని బాబు తెలియజేశారు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్‌లో అనుమానాస్పదంగా గుర్తించబడిన, ఎబోలా సోకినట్లు భావిస్తున్న సుడాన్‌కు చెందిన ఒక ప్రయాణికుడిని సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. 35 ఏళ్లకు పైబడిన ఆ ప్రయాణికుడి శరీర ఉష్ణోగ్రత 100°F ఉన్నట్లు గుర్తించారు. అధిక ప్రమాదం ఉన్న దేశం నుండి ప్రయాణించి వచ్చినందున, పర్యవేక్షణ, పరీక్షల నిమిత్తం అతన్ని ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన నోడల్ కేంద్రానికి తరలించారు. ఆ రోగిలో ప్రస్తుతం ఎబోలాతో సాధారణంగా ముడిపడి ఉండే లక్షణాలేవీ కనిపించడం లేదని డాక్టర్ వంశీ తెలిపారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సీఐఐ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో తన సీఎస్‌ఆర్ కార్యక్రమం పరివర్తన్ ద్వారా, తన పంట వ్యర్థాల నిర్వహణ చొరవలో ఒక మైలురాయిని ప్రకటించింది. ఈ 2025 సీజన్‌లో పంజాబ్, హర్యానా వ్యాప్తంగా 3,78,425 ఎకరాల వ్యవసాయ భూమిలో 88% పంట వ్యర్థాలను కాల్చడం నుంచి కాపాడింది. పంజాబ్‌లోని లూధియానా, సంగ్రూర్ జిల్లాలు, హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని 380కి పైగా గ్రామాలలో 86,000 మంది రైతులకు చేరువవుతున్న ఈ కార్యక్రమం, ఉత్తర భారతదేశంలో వ్యవసాయ వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రైవేట్ రంగం నేతృత్వంలో చేపట్టిన ఒక సమగ్రమైన, ప్రభావవంతమైన ప్రయత్నం.

కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చోగానే ఆ రాష్ట్ర ప్రజలపై వర్షాలు కురిపించారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వరాల జల్లు కురిపించారు. ఈ నెల 3వ తేదీన బెంగళూరులోని లోక్‌ భవన్ గ్లాస్ హౌస్‌లో పార్టీ నేతలు, మత పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అధికారంలోకి వస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని తొలి కీలక ప్రకటన చేసి విద్యార్థులకు శుభవార్త అందించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు