హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో ‘సర్దార్ 2’ తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి సినిమా విశేషాలను పంచుకున్నారు.
పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని 1.93 మీటర్ల మేర అధిగమించింది. దీంతో నీటి వనరుల శాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ, వరద ముందస్తు సన్నద్ధత చర్యలను ముమ్మరం చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు గాంధీ ఘాట్ వద్ద నీటి మట్టం 50.53 మీటర్లుగా నమోదైంది. ఇక్కడ ప్రమాద స్థాయి 48.60 మీటర్లుగా ఉంది. నది తన అత్యధిక వరద స్థాయి (హెచ్ఎఫ్ఎల్) అయిన 50.52 మీటర్లకు అత్యంత సమీపంలో ప్రవహిస్తుండటంతో, ఆ ప్రాంతంలో కొత్త అత్యధిక వరద స్థాయి (హెచ్ఎఫ్ఎల్) నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్: భారతదేశపు విశ్వసనీయమైన, ప్రముఖ స్వదేశీ వినియోగదారుల టెక్నాలజీ బ్రాండ్లలో ఒకటైన మివి ఇప్పుడు క్వాల్కామ్, ఫ్లిప్కార్ట్ మరియు గూగుల్లతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని మివి వన్తో స్మార్ట్ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. మివి వన్ సెప్టెంబర్ 24, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో విడుదల కానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడిన స్నాప్డ్రాగన్ 5G చిప్సెట్తో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ఏకైక స్మార్ట్ఫోన్ కానుంది.
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
బాపట్ల సూర్యలంక- చీరాల బీచ్ విహార కేంద్రం అద్భుతంగా వుందంటూ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ అన్నారు. ఆయన సముద్ర తీరంలో కొద్దిసేపు పర్యాటక పడవలో బోటు షికారు చేసారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా వుందనీ, బస చేసేందుకు గదులు కూడా చాలా నీట్ గా వున్నాయన్నారు. ఫుడ్ కూడా సింప్లి సుపర్బ్ అంటూ కితాబిచ్చారు. ఇంతకుముందు తాము గోవా బీచ్ కు వెళ్లేవారమనీ, ఇకపై బాపట్ల సూర్యలంక-చీరాల బీచ్కే వస్తామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో సముద్ర విహారానికి, సాంప్రదాయ చేనేత వస్త్రాలకు చీరాల - సూర్యలంక ప్రాంతాలు అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక వేదికలు.
జపాన్ భారతదేశానికి గట్టి మద్దతు తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఎదుగుతోందని, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని పేర్కొంటూ, జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశ రేటింగ్ను బీబీబీ ప్లస్ నుండి ఏ-కి అప్గ్రేడ్ చేసింది. దీని అర్థం, ఆ దేశం భారతదేశానికి మరిన్ని రుణాలు ఇవ్వగలదని, పెట్టుబడులు కూడా పెట్టగలదనేదే. దీనిని మరింతగా సద్వినియోగం చేసుకుని, ఆంధ్రప్రదేశ్కు మరిన్ని జపాన్ నిధులను ఎలా మళ్లించగలరనేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వంతు.
రైలు గేటు వేసి వున్నప్పుడు రైలు పట్టాలు దాటవద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా పలువురు అదేమీ పట్టించుకోరు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా తల వంచుకుని అదేదో సురక్షితమైన రహదారి అన్నట్లు వెళ్తుంటారు. ఫలితంగా తమ ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తారు. కొన్నిసార్లు ఎలాగో బ్రతి బైటపడతారు. ఇంకొందరు ప్రమాదం బారిన పడి అంగవికలురుగా మిగులుతారు.తమిళనాడులోని మాయిలాడుతురై జిల్లాలోని సిరిఖాజి రైలు పట్టాలపై ఓ వ్యక్తి గేటు వేసినప్పటికీ క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆ మార్గంలో రైలు వేగంగా వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసి ఆ వ్యక్తిని కాపాడాడు.
తెలంగాణలో ఆటో-రిక్షా ఛార్జీలను పెంచాలని ఒక కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత కొత్త రేట్ల ప్రకారం, మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ. 30గానూ, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు రూ. 14గానూ నిర్ణయించారు. రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ ఇలంబారతి ఇటీవల ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
నీట్ విద్యార్థి గాజువాకలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం నాడు గాజువాకలోని ఒక కోచింగ్ సెంటర్లో నీట్ అభ్యర్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సౌత్ జోన్ సిఐ వాసు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లికి చెందిన రమేష్, శ్రీలక్ష్మిల కుమారుడైన రూపేష్ (19) నీట్ లాంగ్-టర్మ్ కోచింగ్ కోసం పాత గాజువాకలోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చేరాడు. అతను ప్రతిరోజూ అనకాపల్లి నుండి కోచింగ్ సెంటర్కు వచ్చేవాడు. శుక్రవారం కూడా అతను యథావిధిగా కోచింగ్ సెంటర్కు వచ్చాడు.
కలియుగం.. వింతలు జరిగిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లు.. బీహార్లో తాజాగా ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో 18 ఏళ్ల రూబీ వరుడిగా మారాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సంధ్య వధువుగా మారింది.బీహార్లోని బక్సర్ జిల్లా నుండి ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఇద్దరు పిల్లల తల్లి, తన పక్కింట్లో నివసిస్తున్న 18 ఏళ్ల రూబీని వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయి ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ట్రైలర్ను విడుదల చేశారు.
‘ఆ నలుగురు’ ఫేమ్ చంద్ర సిద్ధార్థ్.తాజాగా రూపొందించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తణుకు దంపతులు తమ ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకేశారు. వివరాల్లోకి వెళితే... తణుకుకు చెందిన శ్రీనివాస్ (45), అతని భార్య పద్మిని (42) తమ ఇద్దరు పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకారు. మత్స్యకారులు పద్మినిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
నవంబర్ తొలి వారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు- జూనియర్ కళాశాలలకు అల్పాహార పథకాన్ని విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15న ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీని అమలు తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అలాగే, అక్టోబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కేంద్రీకృత సామాజిక వంటశాలల నిర్మాణం, ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బెంగళూరు వైట్ఫీల్డ్ పోలీస్ పరిధిలోని ఒక పీజీ వసతి గృహం ఏడవ అంతస్తు నుండి దూకడంతో, 23 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మరణించిన జనని (23) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె వైట్ఫీల్డ్లోని ఈసీసీ రోడ్డులో ఉన్న ఆ పీజీ వసతి గృహంలో నివసిస్తోంది. పుదుచ్చేరిలోని ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ప్రియుడు మాణిక్యవేలు (30) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుదుచ్చేరికి చెందిన వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జనని, మాణిక్యవేలు పుదుచ్చేరికి చెందినవారు. జనని గత ఎనిమిది నెలలుగా రాధా కృష్ణ కో-లైవ్ పీజీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉండగా, మాణిక్యవేలు ఆమెను కలిసేందుకు బెంగళూరు వచ్చాడు.
ఎన్నో కులాలు, మతాల కలయిక భారతదేశం. ఎవరో కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకులు లేనిపోని విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తారు తప్ప దేశ ప్రజలందరిలోనూ పరమత సహనం పుష్కలంగా వుంటుంది. ఒక మతానికి సంబంధించిన పండుగ వస్తే మరొక మతం వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వేరే మతానికి చెందిన ఉత్సవం జరుగుతుంటే ఇంకో మతం వారు వెళ్లి దాన్ని ఘనంగా నిర్వహిస్తారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ముస్లిం మహిళ తన కుమారుడికి చిన్నికృష్ణుడి వేషధారణ చేసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఎంతో కలిసిమెలిసి వుంటుండేవారు. ఐతే ప్రేమ వ్యవహారం కాస్త వీరి మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా హత్య వరకూ తీసుకుని వెళ్లింది. స్నేహితుడు అని కూడా చూడకుండా తను ప్రేమించిన అమ్మాయి తనకు మాత్రమే దక్కాలని అతడిని అతి దారుణంగా చంపేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారి పిప్రహా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఇస్రార్, అతడి స్నేహితుడు ఆశిష్ ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించారు. ఇది ఒకరికొకరు తెలుసుకున్నారు.ఆ అమ్మాయి నాదేనంటే నాదే అంటూ గొడవపడ్డారు. ఇక ఇట్లా లాభం లేదనుకున్న ఆశిష్ ఒక పథకం రచించాడు.
తన బాయ్ఫ్రెండ్కు బైక్ కొనేందుకు ఓ యువతి దొంగతనానికి పాల్పడిన ఘటన తమిళనాడు కోవైలో చోటుచేసుకుంది. ఇందుకోసం ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటి నుండి తొమ్మిది సవర్ల బంగారు ఆభరణాలను దొంగిలించి, వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో తన ప్రియుడికి ఖరీదైన మోటార్సైకిల్ను బహుమతిగా ఇచ్చింది. ఈ కేసులో ఆ కళాశాల విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేశారు. పొల్లాచ్చి సమీపంలోని ఎ. సంగంపాలయం వద్ద ఉన్న టి.వి.కె. నగర్కు చెందిన 19 ఏళ్ల యువతి.. ఒక కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది.
కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో, తాను ప్రయాణిస్తున్న స్కూటీ రెండు కార్ల మధ్య ఇరుక్కుపోవడంతో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒకరు మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, హేమంత్, లోకేష్ అనే ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులు స్కూటీపై వెళ్తుండగా, అది రెండు కార్ల మధ్య చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. త్రిస్సూర్ జిల్లాలోని కైపమంగళం వద్ద ఉన్న పనంబికున్నులో, తాము ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. శుక్రవారం రాత్రి సుమారు 11:40 గంటలకు గురువాయూర్ నుండి కొడుంగల్లూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాదు నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కుని గృహ ప్రవేశం చేస్తుంటే హిజ్రాలు వచ్చి తమ ఆనందాన్నంతా ఆవిరి చేసారని ఓ మహిళ ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఆమె మాట్లాడుతూ... గృహ ప్రవేశం చేసేందుకు ఇంట్లోకి వెళ్తున్నామండీ. మాకంటే ముందుగానే మా ఇంట్లోకి హిజ్రాలు వచ్చేసారు. తమకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.మేము అంత ఇచ్చుకోలేమని చెప్పాము. ఐనా వినలేదు. మా బంధువులందరి ముందూ హిజ్రాలందరూ డ్రెస్ పైకెత్తి చూపించారు. ఆ పరిస్థితిలో మా బాధ ఎలా వుంటుందో చెప్పండి. కొత్తగా కొనుక్కున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేస్తున్నామన్న ఆనందం ఎటు పోయిందో.
తాము చేసే ప్రతి ఖర్చును తదుపరి ప్రయాణానికి ఒక అడుగుగా భావించే భారతదేశపు కొత్తతరం యాత్రికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కేపియా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును భారతదేశపు ప్రముఖ ట్రావెల్ ఫిన్టెక్ సంస్థ స్కేపియా, భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా నేడు ఆవిష్కరించాయి.ఈ కార్డు చెల్లింపులు, రివార్డులు, ప్రయాణాలను ఒకే కనెక్టెడ్ యాప్లో తీసుకువస్తుంది. దీనిద్వారా వినియోగదారులు స్కేపియా యాప్ లోనే తమ ఖర్చులను ట్రాక్ చేసుకోవచ్చు, అలాగే ప్రయాణాలను బుక్ చేసుకోవడంతో పాటు రివార్డులను రీడీమ్ చేసుకోవచ్చు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు నవంబరు నుంచి అమల్లోకిరానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మార్పులు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ముఖ్యమైన స్టేషన్లలో ప్రభావం చూపనున్నాయి. నవంబరు 2026 మొదటి వారం నుంచి వేర్వేరు తేదీల్లో ఈ కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా కొత్త సమయాలను సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
మేషం: అశ్వని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం.ఉద్యోగ రంగంలో మీరు చేపట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకుసాగి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది.
ఇటీవలి కాలంలో ప్రియుడి కోసం ప్రేయసి, ప్రియురాలి కోసం ప్రియుడు దొంగలుగా మారుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ప్రియుడు తన ప్రేయసికి ఐ-ఫోన్ బహుమతిగా ఇచ్చేందుకు నేరపూరితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. గంజాయి స్మగ్లింగ్ చేసి తద్వారా డబ్బు సంపాదించి తన ప్రేయసికి ఐ-ఫోన్ కొనివ్వాలని నిర్ణయించుకున్న అతడు ప్రణాళిక రచించాడు. అది కాస్తా బెడిసికొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలు హేమలతకు ఐ-ఫోన్ గిఫ్టుగా ఇవ్వాలని గత కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నాడు. డబ్బు లేకపోవడంతో అతడి వల్లకాలేదు. చివరికి అతడికి ఓ ఐడియా వచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ ట్యాగ్లైన్తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లీసా. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా "టార్టాయిస్". అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు.
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శపించారు. మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరంటూ శపించారు. పైగా, తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలపై లెక్కలు అడిగిన సభ్యులను అవమానిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్లో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి తమ వాదనను వెల్లడించారు.
మహారాష్ట్ర ఆడపులిగా గుర్తింపు పొందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పలు జాతీయ స్థాయి ఈవెంట్లలో సత్తా చాటిన ఆ మహిళా రెజ్లర్కు ఇపుడు ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ కన్నబిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
ఢిల్లీలో వెలుగు చూసిన సైకిల్ కుంభకోణంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ప్రశ్నించేందుకు యత్నించిన ఓ మహిళా జర్నలిస్టును పోలీసులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దేశ రాజధానిలో వెలుగు చూసింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఢిల్లీలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఉన్నారు. ఆమెను ఓ మహిళా జర్నలిస్ట్ వివిధ అంశాలపై ప్రశ్నించాలని భావించారు. 4పీఎం న్యూస్కు చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించడానికి యత్నించారు. దీంతో సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది అంటూ ఢిల్లీ పోలీసులు జర్నలిస్ట్పై దాడికి పాల్పడ్డారు.
పోటీ, సంస్కృతి, కమ్యూనిటీలు ఒక చోట చేరే వేదిక పైకి జావా, యెజ్డీ మరియు BSA మోటార్ సైకిళ్లను తీసుకువస్తూ, ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) 2026లో పాల్గొంటున్నట్లు క్లాసిక్ లెజెండ్స్ ఈరోజు ప్రకటించింది. ఈ కార్యక్రమం ISGL క్యాలెండర్ లోని నగరాల్లో ఒకటైన చెన్నైలో ప్రారంభమై, తదుపరి దేశవ్యాప్తంగా విస్తరించింది. లీగ్ ద్వారా ISGL వేదికల్లో మరియు ఎక్స్ పీరియెన్స్ జోన్లలో ప్రదర్శితమైన జావా, యెజ్డీ మరియు BSA మోటార్ సైకిల్స్ మోటార్ సైక్లింగ్ ప్రపంచాన్ని మించిన బ్రాండ్స్ తో పాల్గొనడానికి ప్రేక్షకులకు అవకాశం కలిగిస్తున్నాయి.
ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వద్ద గోదావరి నది కాలుష్యం కావడానికి ఆంద్రా పేపర్ మిల్సే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. నదిలోకి కాలుష్యాన్ని విడిచిపెడుతూ పన్నులు మాత్రం ఎగ్గొడుతున్నారంటూ మండిపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి చిత్రం కాక షూటింగ్ హైదరాబాద్ లో జరగబోతోంది. ప్రముఖ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని చిత్ర టీమ్ ప్రకటించింది. ఈ కీలక షూటింగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుండి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. చిత్ర బృందం కోసం సుదీర్ఘమైన షెడ్యూల్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాను 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్నదని ప్రకటించారు.
ప్రభాస్ ఇన్స్టాగ్రామ్లో స్పిరిట్ సహనటుడు వివేక్ ఓబెరాయ్ కు ఇలా పోస్ట్ చేశారు, 'పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రియమైన వివేక్ ఒబెరాయ్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న స్పిరిట్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సినిమా కూడా కొంత భాగం పూర్తయింది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఇలా స్పందించారు.
రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట తమ ముగ్గురు చిన్న పిల్లలైన పెద్ద కుమార్తె క్లిన్ కార, కవలలు శివరామ్, అన్వీరా దేవిలతో కలిసి సాంప్రదాయ పూజతో జన్మాష్టమిని జరుపుకున్నారు. రంగురంగుల దుస్తులు, పూలమాలలతో అలంకరించిన చిన్నారి శివరామ్ కృష్ణుడిగా కనిపించగా, మరో చిన్నారి పూజా సామాగ్రి, పూలతో అలంకరించిన దేవతా విగ్రహం మధ్య రాధగా మెరిసింది. కోనిడెల దంపతులు తమ సినీ ప్రపంచ జీవితాల్లో భక్తిని, ఆనందాన్ని ఎలా మేళవిస్తారో తెలియజేస్తూ, అభిమానులు ఈ కుటుంబ క్షణాన్ని ఆరాధ్యమైనదిగా, దైవికమైనదిగా అభివర్ణించారు.
ద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు.దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.
రాజమండ్రికి చెందిన సూరి (అల్లరి నరేష్)కి వంశ పారంపర్యంగా డ్రామా కంపెనీ నడుపుతుంటారు. తండ్రికి హీరో అవ్వాలని కోరిక వుంటుంది. కాలేకపోతాడు. దానితో ఆలోటును నేను తీరుస్తానని సూరి తన అమ్మకు చెబుతాడు. అయితే కష్టపడడం మానేసి వంశపారంపర్యంగా ఇంటిలో వున్న ఓ మ్యాజిక్ బుక్ పై సరైన విధంగా రాస్తే ఇంధ్రలోపకం నుంచి రంభ, ఊర్వశి, మేనక వచ్చి తన కోరికలన్నీ తీరుస్తాడని గట్టిగా నమ్ముతాడు. అందుకే వారి విగ్రహాలకు పెట్టి పూజిస్తుంటాడు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై వెయ్యిరోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరోవైపు, విపక్షాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైనశైలిలో నిరసన వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలించారు. ఆయన ఏకంగా వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకుని ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అయింది.
హైదరాబాద్: పది సంవత్సరాల క్రితం, 2016 సెప్టెంబర్ 5న, రిలయన్స్ జియో భారత్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించి, ప్రజలు ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా మాట్లాడుకుంటారు, ఎలా జీవిస్తారు అనే విషయాలను మార్చిన ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని ఉన్న విస్తారమైన టెలికమ్యూనికేషన్ సేవా ప్రాంతంలో దీని ప్రభావం పూర్తిగా నిర్మాణాత్మకంగా, సామాజికంగా వచ్చిన పునర్జన్మ లాంటిది. గత పది సంవత్సరాల్లో ఈ ప్రాంత మార్కెట్ తీవ్ర డిజిటల్ కొరత నుంచి డిజిటల్ సమృద్ధికి మారింది.
మరో నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) డ్రైవర్ పాల్ కురియన్ తను నడిపిన బస్సుకు ధన్యవాదాలు తెలియజేసాడు. నాలుగు చక్రాలకు నమస్కరించాడు. బస్సు ఇంజిన్ గ్రిల్ వద్దకు వచ్చి వచ్చి ప్రేమతో తన తలను దానికి ఆనించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కఠినమైన కుంభం-కుమిలి-కరువక్కుళం-కొట్టాయం మార్గంలో తాను ఎనిమిదేళ్లుగా నడిపిన బస్సుకు సెప్టెంబర్ 2న భావోద్వేగభరితమైన నివాళులర్పించి తన చివరి విధిని ముగించారు.తన 18 ఏళ్ల కెరీర్లో, ఆయన కఠినమైన రోడ్డు మార్గంలో ప్రతిరోజూ 480 కిలోమీటర్లు ప్రయాణించారు.
రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల కారణంగా కొండా సురేఖకు మంత్రిపదవిని పోయింది. ఒక చిన్నపాటి వివాదం చివరకు మంత్రిపదవికే ఎసరు పెట్టింది. ఇపుడు కొండా సురేఖతో పాటు ఆమె ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
భారత క్రికెట్ జ్టటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించింది. గురువారం జరిగిన కీలక సమీక్ష సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడంతో.. ఆయన పదవీకాలంపై పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ ప్రచారాలను కొట్టిపారేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నారు. కేసీఆర్ చాలా మంచోడన్నారు. తాము బీఆర్ఎస్లో ఉన్నపుడు తమను ఒక్క మాట కూడా అనలేదని, తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు కోలీవుడ్ అగ్రహీరో, రేసర్ అజిత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అజిత్ ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధాని చెన్నై నగరంలో అధునాతన ఒలింపిక్ సిటీతో పాటు మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనన్నట్టు రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అజిత్ కుమార్ స్పందిస్తూ, సీఎం విజయ్కు ధన్యవాదాలు తెలిపారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు.
ఆకస్మిక వరదలతో కుదేలైపోయిన నేపాల్ క్రమంగా కోలుకుంటుంది. అయితే, అనేక ప్రాంతాల్లో పలువురు బాధితులను రెస్క్యూ సిబ్బంది సజీవంగా ప్రాణాలతో వెలికి తీస్తోంది. తాజాగా ఓ సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఓ వ్యక్తిని వెలికి తీశారు.