Shorts

హైదరాబాద్: భారతదేశపు విశ్వసనీయమైన, ప్రముఖ స్వదేశీ వినియోగదారుల టెక్నాలజీ బ్రాండ్‌లలో ఒకటైన మివి ఇప్పుడు క్వాల్‌కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు గూగుల్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని మివి వన్‌తో స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. మివి వన్ సెప్టెంబర్ 24, 2026న ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల కానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అభివృద్ధి చేయబడిన స్నాప్‌డ్రాగన్ 5G చిప్‌సెట్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్ కానుంది.

రైలు గేటు వేసి వున్నప్పుడు రైలు పట్టాలు దాటవద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా పలువురు అదేమీ పట్టించుకోరు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా తల వంచుకుని అదేదో సురక్షితమైన రహదారి అన్నట్లు వెళ్తుంటారు. ఫలితంగా తమ ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తారు. కొన్నిసార్లు ఎలాగో బ్రతి బైటపడతారు. ఇంకొందరు ప్రమాదం బారిన పడి అంగవికలురుగా మిగులుతారు.తమిళనాడులోని మాయిలాడుతురై జిల్లాలోని సిరిఖాజి రైలు పట్టాలపై ఓ వ్యక్తి గేటు వేసినప్పటికీ క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆ మార్గంలో రైలు వేగంగా వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసి ఆ వ్యక్తిని కాపాడాడు.

బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్ పరిధిలోని ఒక పీజీ వసతి గృహం ఏడవ అంతస్తు నుండి దూకడంతో, 23 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మరణించిన జనని (23) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె వైట్‌ఫీల్డ్‌లోని ఈసీసీ రోడ్డులో ఉన్న ఆ పీజీ వసతి గృహంలో నివసిస్తోంది. పుదుచ్చేరిలోని ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ప్రియుడు మాణిక్యవేలు (30) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుదుచ్చేరికి చెందిన వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జనని, మాణిక్యవేలు పుదుచ్చేరికి చెందినవారు. జనని గత ఎనిమిది నెలలుగా రాధా కృష్ణ కో-లైవ్ పీజీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉండగా, మాణిక్యవేలు ఆమెను కలిసేందుకు బెంగళూరు వచ్చాడు.

ఇటీవలి కాలంలో ప్రియుడి కోసం ప్రేయసి, ప్రియురాలి కోసం ప్రియుడు దొంగలుగా మారుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ప్రియుడు తన ప్రేయసికి ఐ-ఫోన్ బహుమతిగా ఇచ్చేందుకు నేరపూరితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. గంజాయి స్మగ్లింగ్ చేసి తద్వారా డబ్బు సంపాదించి తన ప్రేయసికి ఐ-ఫోన్ కొనివ్వాలని నిర్ణయించుకున్న అతడు ప్రణాళిక రచించాడు. అది కాస్తా బెడిసికొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలు హేమలతకు ఐ-ఫోన్ గిఫ్టుగా ఇవ్వాలని గత కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నాడు. డబ్బు లేకపోవడంతో అతడి వల్లకాలేదు. చివరికి అతడికి ఓ ఐడియా వచ్చింది.

ఢిల్లీలో వెలుగు చూసిన సైకిల్ కుంభకోణంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ప్రశ్నించేందుకు యత్నించిన ఓ మహిళా జర్నలిస్టును పోలీసులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన దేశ రాజధానిలో వెలుగు చూసింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఢిల్లీలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఉన్నారు. ఆమెను ఓ మహిళా జర్నలిస్ట్ వివిధ అంశాలపై ప్రశ్నించాలని భావించారు. 4పీఎం న్యూస్‌కు చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించడానికి యత్నించారు. దీంతో సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది అంటూ ఢిల్లీ పోలీసులు జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడ్డారు.

ద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు.దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.

హైదరాబాద్: పది సంవత్సరాల క్రితం, 2016 సెప్టెంబర్ 5న, రిలయన్స్ జియో భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించి, ప్రజలు ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా మాట్లాడుకుంటారు, ఎలా జీవిస్తారు అనే విషయాలను మార్చిన ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని ఉన్న విస్తారమైన టెలికమ్యూనికేషన్ సేవా ప్రాంతంలో దీని ప్రభావం పూర్తిగా నిర్మాణాత్మకంగా, సామాజికంగా వచ్చిన పునర్జన్మ లాంటిది. గత పది సంవత్సరాల్లో ఈ ప్రాంత మార్కెట్ తీవ్ర డిజిటల్ కొరత నుంచి డిజిటల్ సమృద్ధికి మారింది.