తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా వుండనుంది. సాధారణంగా ఏప్రిల్- మే నెలల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటికే మార్చిలో నమోదవుతాయి. శుక్రవారం, మార్చి 6న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్ని ప్రాంతాలలో 41 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో, గత కొన్ని రోజులుగా పాదరసం క్రమంగా పెరుగుతోంది. గురువారం ములుగు జిల్లాలోని మంగపేటలో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం వంటి జిల్లాలు కూడా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నాయి.
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదో ఓవరులో బౌలింగ్కు వచ్చిన బుమ్రా.. తాను వేసిన తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ను ఔట్ చేయడం ద్వారా 500వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత క్రికెట్ జట్టును అభినందించారు. ఇంగ్లాండ్ను ఓడించి ఐసిసి పురుషుల టి20 క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు చేరినందుకు చంద్రబాబు జట్టును అభినందించారు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై భారత్ విజయం దేశానికి ఒక ఉత్తేజకరమైన, గర్వకారణమైన క్షణం అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనను ప్రశంసించారు.
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలోనూ బయట బంధువులు, స్నేహితులు తెలియజేస్తున్నారు. మార్చి 6, 2011 నుండి వివాహం చేసుకున్నారు, నేటితో 15 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు. కాగా, ఇదే మార్చి 6, 2026న అల్లు శిరీష్ వివాహం జరగనుంది. హైదరాబాద్ లో ఓ స్టూడియోలో అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముకులు సిద్ధమయ్యారు. నయనిక రెడ్డిని శిరీష్ వివాహం చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులోభాగంగా, మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేల ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది.
గణేశుడిని అడ్డంకులను తొలగించేవాడు. కష్టాలను తొలగించేవాడుగా భావిస్తారు. బాలచంద్ర సంకష్టి చతుర్థి నాడు వ్రత కథను పఠించడం లేదా వినడం వల్ల భక్తుల జీవితాల్లోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజును రాజయోగ సంకష్ట హర చతుర్థిగా పిలుస్తారు. ఈ రాజయోగ సంకష్ట హర చతుర్థి రోజున వినాయకుడికి కొబ్బరి మాలను, గరికతో మాలను కట్టి సమర్పించడం ద్వారా శనిదోషాలు, రాహు కేతు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాయంత్రం పూట వినాయకుని ఆలయాల్లో జరిగే అభిషేకాలను కనులారా వీక్షించే వారికి సర్వ దోషాలు తొలగిపోతాయి.
హీరో శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’ కోసం పూర్తి స్థాయిలో మాస్ అవతారమెత్తారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి మాస్ లుక్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. చెమటతో కూడిన అవతారంలో సీరియస్ చూస్తే నోటిలో బీడీ తాగుతూ తీక్షణంగా చూస్తున్న ఈ లుక్ ను నేడు శర్వానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. గంగ అనే పాత్రలో నటిస్తున్నారు.
టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్లో వరుసగా వైఫల్యం చెందుతున్నారు. దీనిపై మరో ఓపెనర్ సంజూ శాంసన్ స్పందించాడు. అభిషేక్ శర్మలు తక్కువ అంచనా వేయొద్దని హితవు పలికాడు. ఫైనల్ మ్యాచ్లో విజృంభించే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రికెట్లో ప్రతి క్రికెటర్ ఫామ్ కోల్పోవడం సాధారణమేనన్నాడు. కానీ, తనదైన రోజున అభిషేక్ విజృంభిస్తాడని, అది వరల్డ్ కప్ ఫైనల్స్ అవుతుందేమో ఎవరికి తెలుసన్నాడు.
కొత్తగా పునర్వ్యవస్థీకరించబడిన జిల్లాల ఆధారంగా రాబోయే జిల్లా పరిషత్ (జెడ్పి) ఎన్నికలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలియజేశారు. ఈ చర్యకు ప్రభుత్వం అవసరమైన సన్నాహాలు చేస్తోందని, కొత్త జిల్లా నిర్మాణానికి అనుగుణంగా పంచాయతీలను పునర్వ్యవస్థీకరించడంలో ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని ఆయన స్పష్టం చేశారు.
నూతన దంపతులు విజయ్ దేవరకొండ ,రష్మిక ల వివాహ అనంతరం వేడుక హైదరాబాద్ లో తాజ్ లో జరిగింది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యారు. మార్చి 4న జరిగిన ఈ వేడుకలెో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించలేదు. ఆయన బిజీగా వున్నందున రాలేకపోయినట్లు తెలుస్తోంది.
ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ప్రఖ్యాత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో మార్చి 6 నుండి 8 వరకు మహాకుంభాభిషేకం జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఒకటి. ఈ కార్యక్రమం మార్చి 8న ఉదయం 9.24 గంటలకు 12 పవిత్ర నదుల నుండి సేకరించిన పవిత్ర జలాలను ఉపయోగించి ఆలయ బంగారు గోపురానికి అభిషేకంతో ముగుస్తుంది.
మంజీర ఫేజ్-III వ్యవస్థలో మరమ్మతులు, భర్తీ పనుల కారణంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం నుండి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. పెద్దాపూర్లోని పంప్ హౌస్లోని 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హై టెన్షన్ (HT) విద్యుత్ ప్యానెల్లను తొలగించి కొత్త ప్యానెల్లతో భర్తీ చేస్తామని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు తెలిపారు.
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 రకం యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.
ఈ మధ్య కాలంలో టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ను నెటిజన్లు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తరచుగా ఆమె ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది. తప్పు చేసే వారిని వదిలేసి, దాన్ని ఎదురించే వారిని టార్గెట్ చేయడంపై తాజాగా అసహనం వ్యక్తంచేశారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆంధ్రప్రదేశ్ అంతటా 6,132 4జీ సైట్లను ప్రారంభించింది. డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ప్రాజెక్ట్ కింద గతంలో అనుసంధానించబడని వేలాది గ్రామాలకు కవరేజీని విస్తరించింది. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ సర్కిల్ సీజీఎంటీ ఎం శేషాచలం, డీబీఎన్ కింద 1,325 సైట్లను ఏర్పాటు చేశామని, ఇది 2,641 అన్కవర్డ్ గ్రామాలకు కనెక్టివిటీని అందిస్తుందని చెప్పారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ ఓడిపోగా, భారత్ ఏడు పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ (105) సెంచరీతో ఒంటిరి పోరాటం చేసినప్పటికీ మ్యాచ్ ఆఖరులో రనౌట్ రూపంలో వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది. ఫలితంగా భారత్ నిర్ధేశించిన 254 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఏడు రన్స్ తేడాతో విజయభేరీ మోగించింది.
ఇరాన్ నావికాదళానికి చెందిన ఫ్రిగేట్ ఐరిస్ డెనా శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా దాడికి గురై మునిగిపోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై భారత నౌకాదళం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆపదలో ఉన్న నావికులను రక్షించేందుకు శ్రీలంక నావికాదళంతో కలిసి సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ ఇరాన్ నౌక ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళం భారీ స్థాయిలో నిర్వహించిన మిలాన్-2026 విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ దాడి చోటుచేసుకుంది.
మహిళలు బరువు తగ్గాలంటే.. తప్పకుండా తేనెను డైట్లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను రుబ్బి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే శరీరానికి కూడా హానికరం కావచ్చు. తేనె తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా సులభం. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలు బరువును సులభంగా తగ్గవచ్చు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప ఎంపిక. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లకు భారత ఓపెనర్ సంజూ శాంసన్ చుక్కలు చూపించాడు. గురువారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ 42 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 89 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 13.1 ఓవర్లో జట్టు స్కోరు 160 పరుగుల వద్ద ఉండగా మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అలాగే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మరోమారు బ్యాటింగ్లో విఫలమయ్యాడు.
శ్రీ సత్యసాయి జిల్లా, వ్యవసాయ పొలాల్లో మూడు చిరుతలు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం, శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో పులుల సంచారం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక రైతులలో భయాన్ని సృష్టించింది. చాంద్ బాషా అనే రైతు మొదట చిరుతలు పొలాల గుండా కదులుతున్నట్లు గమనించి సమీపంలోని ఇతరులకు సమాచారం అందించాడు. వెంటనే, కొంతమంది స్థానిక యువకులు, ప్రజలు వాటిని తరిమికొట్టారు. ఇంకా తమ మొబైల్ ఫోన్లలో చిరుత పులుల సంచారానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంలావాదేవీలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు. వీరిని సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతించింది. అనంతరం.. ఈ కార్యక్రమానికి హాజరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో లోకేశ్, బ్రాహ్మణిలు మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ దంపతులు నవ వధూవరులైన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
తిరుమలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభిస్తానని కవిత ప్రకటించారు. తాము ఏర్పాటు చేసే పార్టీకి శ్రీవారి ఆశీస్సులు వుంటాయని బలంగా నమ్ముతున్నట్లు కవిత తెలిపారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి బయటపడితే తిరుమలకు కాలినడకన వస్తానని కవిత మొక్కుకున్నారు. ఆ విధంగానే కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో కవిత తిరుపతికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో కవితకు అక్కడి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్దంగా ఉన్నారు.
భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి ప్రారంభమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ కీలక పోరు కోసం ఇరు జట్లను ప్రకటించాయి.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం నాడు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను నిర్వహించింది.
జమ్మికుంటలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట వద్ద గురువారం తెల్లవారుజామున రైలు పట్టాలపై ఒక చక్రం విరిగిపోవడంతో అప్రమత్తమైన లోకో పైలట్ పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు. వరంగల్ - బల్హర్షా మార్గాన్ని కలిపే జమ్మికుంట రైల్వే స్టేషన్కు హిసార్ ఎక్స్ప్రెస్ చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
తొలి బిడ్డతో సరిపెట్టుకునే దంపతులకు ఇది గుడ్ న్యూసేనని చెప్పాలి. తగ్గుతున్న జనన రేటును పెంచేందుకు రెండవ బిడ్డకు జన్మనిచ్చే జంటలకు రూ.25,000 జనన ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎం అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్)ను ప్రస్తుత 1.5 నుండి 2.1కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భర్తీ స్థాయి కంటే తక్కువ అని చంద్రబాబు అన్నారు.
కథానాయకుడు శర్వా అడ్రెనలిన్ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిUV క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను లాంచ్ చేశారు.
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందింది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి తనుజ పుట్టస్వామి. ఇటీవల బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే. గురువారం తనుజకు పుట్టినరోజు కావడంతో ఆమె తిరుమల శ్రీవారిన దర్శించుకున్నారు. బిగ్బాస్ హౌస్లో పాల్గొన్న సమయంలో తనుజకు అనేక మంది స్నేహితులు ఏర్పడ్డారు. వారిలో ముఖ్యంగా దివ్వెల మాధురితో ఏర్పడిన స్నేహం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఏపీ శాసనసభ సమావేశాలకు వైకాపా సభ్యులు హాజరుకాకుండా పారిపోతూ జీతాలు మాత్రం తీసుకుంటున్నారని, కానీ, వాళ్ల పార్టీకి చెందిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం జీతం తీసుకోవడం లేదని స్పీకర్ సీహెచ్.అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైకాపా సభ్యులు గైర్హాజరుపై స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల గురించి గళం విప్పుతారని ఓట్లు వేసి గెలిపిస్తే సభకు రాకుండా పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. సభకు హాజరుకాకుండా కేవలం బయట ఉంటూ వేతనాలు తీసుకోవడం అనైతికంగా సరికాదన్నారు. వైకాపా సభ్యులంతా జీతాలు తీసుకుంటున్నారని, కాన, వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని చెప్పారు.
నాగచైతన్య లేటెస్ట్ మూవీ వృషకర్మ గ్లింప్స్ ఈరోజు హైదరాబాద్ ప్రసాద్స్ లో విడుదల చేశారు. అతీంద్రియశక్తుల నేపథ్యంలో వుంది. విలన్ చేసే అరాచకాలను అడ్డుకట్టవేసేందుకు పుట్టాడన్న కాన్సెప్ట్ ఇందులో కనిపిస్తుంది. మనిషిలోంచి గబ్బిలాలు రావడం, నోటిగుండూ బయటకు రావడం, ఊరిలో ప్రజలను భయభ్రాంతులను చేయడం, ఫైనల్ గా హీరో వచ్చి ఆ శక్తుల్ని అంతమొందించడం అనేవి సింపుల్ గా చూపించారు.
మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్త్ మిషన్ 100 పేరుతో మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను నేరుగా పేదల ముంగిటకే చేర్చడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ హెల్త్ స్క్రీనింగ్ ప్రక్రియను రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, 2027 పుష్కరాల నిర్వహణపై సబ్-కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్కు సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వం వహిస్తారు.
ఇరాన్తో ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇది మధ్యప్రాచ్య దేశాలలో చిక్కుకున్న వారిపైనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారిపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. త్వరలో కాల్పుల విరమణ ప్రకటించకపోతే, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆయన అన్నారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల గృహాలను కూల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకలమై సెమీ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్తో తలపడనుంది. క్రికెట్లోని చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్ సెమీస్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా, వరుసగా మరోసారి ఫైనల్కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది, ఓడిన జట్టు ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య వాయుమార్గ పరిమితుల కారణంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు అనే మూడు మెట్రో విమానాశ్రయాల నుండి బుధవారం సుమారు 180 విమానాలు రద్దు చేయబడినట్లు వర్గాలు తెలిపాయి. ముంబై విమానాశ్రయంలో 48 డిపార్చ్యూస్, 45 రాకపోకలు సహా 93 విమానాలు రద్దు చేయగా, ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం 52 విమానాలు రద్దు చేయబడ్డాయి. వీటిలో 25 డిపార్చ్యూస్, 27 రాకపోకలు ఉన్నాయి. బెంగళూరు విమానాశ్రయంలో పనిచేస్తున్న వివిధ విమానయాన సంస్థలు 18 రాకపోకలు సహా 34 విమానాలను నడపలేదని వర్గాలు తెలిపాయి.
మార్చి 18 లేదా 19 తర్వాత తెలంగాణలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే వర్షపాతం ఫిబ్రవరి 23- 24 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షాల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కాలంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ పరిశీలకులు హెచ్చరించారు. అయితే, మార్చి 17 లేదా 18 వరకు తెలంగాణ అంతటా పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్లో విద్యార్థిని ప్రసవం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన గర్భానికి కారణమైన బంధువును రక్షించే ప్రయత్నంలో నేరాన్ని తోటి విద్యార్థిపై నెట్టేందుకు విద్యార్థిని ప్రయత్నించింది. అయితే, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థినిని గర్భవతి చేసి వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభకు వెళ్లనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా పడింది. కొద్ది రోజుల క్రితమే ధోనీ మరో న్యాయపరమైన సమస్యను ఎదుర్కొన్నాడు. నివాసం కోసం కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలతో జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆయనకు నోటీసులు జారీ చేసింది.తాజాగా రాంచీలో వేగంగా వాహనం నడిపినందుకుగాను ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. తన ఇంటి సమీపంలో ధోనీ వాహనం వేగంగా వెళ్లడాన్ని నగరంలోని ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. దీంతో మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 183 కింద అధికారులు ఆయనకు ఈ-చలాన్ జారీ చేశారు.
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. "లీడర్" సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
థియేటర్లో పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
హోలీ సంబరాలు ఓ పిల్లాడి జీవితంలో విషాదాన్ని నింపాయి. మీద రంగు చల్లాడన్న కోపంతో బామ్మ ఆ పిల్లాడిపై వేడి వేడి నీళ్లు పోసింది. తీవ్రగాయాలపాలైన పిల్లాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగ్పూర్ జిల్లా కోరాడి ఏరియాకు చెందిన సింధు థాక్రే అనే వృద్ధురాలు బకెట్లో వేడి నీళ్లు నింపుకుని రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళుతూ ఉంది. ఇంతలో ఆమె మనవడు హోలీ రంగులు స్ప్రే చేసే గన్తో దగ్గరకు వచ్చాడు. ఆమెపై రంగు స్ప్రే చేయసాగాడు.
శ్రీలంకలోని ఓ హోటల్లో పని చేసే హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది పట్ల పాకిస్థాన్ క్రికెటెర్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హోటల్ యాజమాన్యం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. సదరు క్రికెటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన జట్టు మేనేజర్.. సమస్య పెద్దది కాకుండా, హోటల్ యాజమాన్యానికి, సదరు మహిళకు క్షమాపణలు చెప్పించారు. దీంతో ఆ సమస్య సద్దుమణిగిపోయింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.