Shorts

ఏపీ శాసనసభ సమావేశాలకు వైకాపా సభ్యులు హాజరుకాకుండా పారిపోతూ జీతాలు మాత్రం తీసుకుంటున్నారని, కానీ, వాళ్ల పార్టీకి చెందిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం జీతం తీసుకోవడం లేదని స్పీకర్ సీహెచ్.అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైకాపా సభ్యులు గైర్హాజరుపై స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల గురించి గళం విప్పుతారని ఓట్లు వేసి గెలిపిస్తే సభకు రాకుండా పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. సభకు హాజరుకాకుండా కేవలం బయట ఉంటూ వేతనాలు తీసుకోవడం అనైతికంగా సరికాదన్నారు. వైకాపా సభ్యులంతా జీతాలు తీసుకుంటున్నారని, కాన, వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని చెప్పారు.

శ్రీలంకలోని ఓ హోటల్‌లో పని చేసే హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది పట్ల పాకిస్థాన్ క్రికెటెర్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హోటల్ యాజమాన్యం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. సదరు క్రికెటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన జట్టు మేనేజర్.. సమస్య పెద్దది కాకుండా, హోటల్ యాజమాన్యానికి, సదరు మహిళకు క్షమాపణలు చెప్పించారు. దీంతో ఆ సమస్య సద్దుమణిగిపోయింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.