Shorts

పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి.మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది.గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది.పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు.క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది.గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి.పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి.ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి.ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి.గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి.రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, ఆర్థికంగా సుసంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం, భక్తులు సమర్పించే విరాళాలు, హుండీ కానుకల ద్వారా సమకూరే టీటీడీ నిధులను ఉపయోగించి, అనేక సేవా కార్యక్రమాలు, ప్రజాహిత కార్యకలాపాలు నిర్వహించబడుతుంటాయి.ఈ క్రమంలోనే, టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5000 ఆలయాలను నిర్మించనుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం మొదలైంది. ఆలయాల నిర్మాణం కంటే, ఈ నిధులను పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించవచ్చని కొందరు వ్యక్తులు అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు హైదరాబాద్ నుంచి హుబ్బళ్లికి వెళ్తున్న ఫ్లై91 ఎయిర్‌లైన్స్ ఐసి3401 విమానం నిర్ణీత సమయానికి ల్యాండ్ కాకుండా, దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బెంగళూరులో దిగిన సంఘన వెలుగుచూసింది. కేవలం గంటన్నరలో బెంగళూరు వెళ్లాల్సిన ఈ విమానం 4 గంటల పాటు గాల్లోనే అటూఇటూ తిరుగుతుండటంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హాహాకారాలు చేసారు.ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం, సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉండగా, గాలిలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.

టీవీకే అధ్యక్షుడు, కోలీవుడ్ హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఆయన... దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తి విలువను వేర్వేరుగా చూపించారు. దీనిపై చెన్నైకు చెందిన వి.విగ్నేష్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో చెన్నై పెరంబూరు, తిరుచి సెంట్రల్ నియోజకవర్గాలో విజయ్ పోటీ చేస్తున్నారని, ఇందుకోసం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌‍లలో ఆస్తి విలువలో తేడాలు ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకపర్తి సరస్సులో డెవిల్ ఫిష్ మూక మత్స్యకారులను బెంబేలెత్తిస్తున్నాయి. చేపలు పట్టేందుకు సరసులో వలలు వేస్తుంటే ఆ వలల్ని ముక్కముక్కలుగా కొరికేస్తున్నాయి. మరోవైపు ఇతర చేపలను తినేస్తున్నాయి. దీనితో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చేపలు పట్టేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరసులో చేపల వేటకు వెళితే రాకాసి చేపలు దొరుకుతున్నాయి. 3 నుంచి 4 టన్నులు వరకూ ఈ చేపలే పడుతున్నాయి. 100 కుటుంబాలు ఈ చేపల వేట మీద ఆధారపడి వున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.