మంగళవారం నాడు ముఖ్యంగా హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవిని పూజిస్తే విశేష ఫలితాలను ఇస్తారని చెప్పబడింది. మంగళవారం ఏ దేవుడిని పూజించాలి, వారి శ్లోకాలు ఏమిటో తెలుసుకుందాము. హనుమంతుడుధైర్యం, బలం, ఆపదల నుండి రక్షణ కోసం మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. ముఖ్యంగా శని దోషాలు ఉన్నవారు, భయం పోగొట్టుకోవాలనుకునే వారు స్వామిని ఆరాధిస్తారు.శ్లోకం:మనోజవం మారుతతుల్యవేగంజితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |వాతాత్మజం వానరయూథముఖ్యంశ్రీరామదూతం శిరసా నమామి ||
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి.మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది.గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది.పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు.క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది.గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి.పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి.ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి.ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి.గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి.రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. కృత్రిమ మేధస్సు. కనుగొన్నదే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇప్పుడదే వారికి భస్మాసుర హస్తంగా మారుతోంది. ఏదైతే కనిపెట్టారో అదే వారి ఉద్యోగాలు పోవడానికి కారణం అవుతోంది. ఈ ఏడాది 2026 మొదటి 3 నెలల అంతానికి పలు కంపెనీలు తొలగించిన ఉద్యోగులు సంఖ్య 73,000 దాటిపోయింది. మెటా మరో 8 వేల మందిపై వేటు వేసేందుకు సిద్ధంగా వున్నదని సమాచారం. ఇలా ఏ మూల చూసినా ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో... తమ ఉద్యోగం వుంటుందా వూడుతుందా అనే భయంతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇన్స్టాగ్రామ్ రీల్స్, చాటింగ్ ద్వారా ఆగ్రాకు చెందిన 40ఏళ్ల వితంతువుతో 21 ఏళ్ల యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రస్తుతం వారిద్దరూ లివింగ్ టు గెదర్లో వున్నారు. మొదట స్నేహంగా, ఆపై ఆకర్షణ వీరి పరిచయం మారింది. ఒక రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. ఆమెతో కలిసి జీవించేందుకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేశాడు. ఆపై ఆమెతో కలిసి జీవించడం ప్రారంభించాడు.
రాయలసీమ వ్యాప్తంగా ఉన్న చిల్లర మార్కెట్లలో టమాటా ధరలు కిలోకు సుమారు రూ. 40కి చేరాయి. దీర్ఘకాలంగా కొనసాగిన ధరల పతనం తర్వాత రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. దాదాపు మూడు నెలల పాటు ధరలు సాగు ఖర్చుల కంటే దిగువకు పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొందరు రైతులు తమ పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో వీధికుక్కలు స్వైర విహారం సృష్టించాయి. మూడేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి, పీక్కుతున్నాయి. ఈ దాడిలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని దివ్యా బ్రెహ్రా అనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ బాలిక తమ ఇంటి ముందు వీధిలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా ఆ బాలికపై దాడి చేశాయి. కుక్కలు బాలికను నోట కరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లాయి.
వ్యక్తిగత పనుల కోసం అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు క్యాబ్లను బుక్ చేసుకుంటారు. ఇలాంటి క్యాబ్ డ్రైవర్లలో పలువురు కస్టమర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటూ వార్తలకెక్కుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను వేధించాడు. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు.. మీ వయసెంత అంటూ మెసేజ్ పంపించాడు. ఈ విషయాన్ని ఆ బాధితురాలు సోషల్ మీడియాలో వెల్లడించడంతో అది వైరల్ అయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీలో దారుణం చోటుచేసుకున్నది. ఎర్రటి ఎండలో ఓ యువతిని ఓ వ్యక్తి రోడ్డుపై పడేసి అతి క్రూరంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను రోడ్డుపైనే పడేసి ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూస్తూనే కొంతమంది పాదచారులు, వాహనదారులు వెళ్లిపోయారు.కానీ ఇద్దరు యువకులు మాత్రం యువతిని హింసిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. యువతిని రక్షించి వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. యువకులు చూపిన మానవతకు పోలీసులు ప్రశంసించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, ఆర్థికంగా సుసంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం, భక్తులు సమర్పించే విరాళాలు, హుండీ కానుకల ద్వారా సమకూరే టీటీడీ నిధులను ఉపయోగించి, అనేక సేవా కార్యక్రమాలు, ప్రజాహిత కార్యకలాపాలు నిర్వహించబడుతుంటాయి.ఈ క్రమంలోనే, టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5000 ఆలయాలను నిర్మించనుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం మొదలైంది. ఆలయాల నిర్మాణం కంటే, ఈ నిధులను పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించవచ్చని కొందరు వ్యక్తులు అభిప్రాయపడ్డారు.
తాజాగా ఆడిన పిండి లేదా మసాలాల సువాసన కేవలం ఆహారానికి సంబంధించినది మాత్రమే కాదు. అది, పదార్థాలు స్వచ్ఛంగా ఉండి, తయారీ ప్రక్రియలు నెమ్మదిగా సాగి, రుచి విషయంలో ఎప్పుడూ రాజీ పడని ఒకప్పటి జ్ఞాపకం. వంటగదులు వేగం, సౌలభ్యం కోసం ఆధునికతను సంతరించుకోవడంతో, ఆ అనుభవం రోజువారీ జీవితం నుండి నిశ్శబ్దంగా కనుమరుగైంది. 35 సంవత్సరాలకు పైగా తయారీ నైపుణ్యం కలిగిన సాఫ్టెల్, ఆధునిక గృహావసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆ అనుభవాన్ని తిరిగి తీసుకువస్తోంది.
ట్రాన్స్జెండర్ తమన్నా షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తను గర్భవతినయ్యానంటూ ఫోటోలు షేర్ చేసింది. పిల్లలు పుట్టేందుకు తను చేయించుకున్న ప్రత్యేక చికిత్స విజయవంతమైందనీ, త్వరలోనే తను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. తమ పెళ్లి జరిగి గత 20 రోజుల క్రితమే ఏడాది పూర్తి చేసుకున్నదనీ, ఇంతలోనే తను గర్భవతి కావడం ఎంతో ఆనందంగా వుందని పేర్కొన్నది.కాగా బాలుడిగా జన్మించి ముంబై మహానగరంలో లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని మస్తాన్ నుంచి తమన్నా సింహాద్రిగా మారింది. బిగ్ బాస్ తెలుగు హౌసులోనూ అడుగుపెట్టింది.
ఆదివారం నాడు హైదరాబాద్ నుంచి హుబ్బళ్లికి వెళ్తున్న ఫ్లై91 ఎయిర్లైన్స్ ఐసి3401 విమానం నిర్ణీత సమయానికి ల్యాండ్ కాకుండా, దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బెంగళూరులో దిగిన సంఘన వెలుగుచూసింది. కేవలం గంటన్నరలో బెంగళూరు వెళ్లాల్సిన ఈ విమానం 4 గంటల పాటు గాల్లోనే అటూఇటూ తిరుగుతుండటంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హాహాకారాలు చేసారు.ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం, సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉండగా, గాలిలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. టాప్ ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె
టీవీకే అధ్యక్షుడు, కోలీవుడ్ హీరో విజయ్కు మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఆయన... దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తి విలువను వేర్వేరుగా చూపించారు. దీనిపై చెన్నైకు చెందిన వి.విగ్నేష్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో చెన్నై పెరంబూరు, తిరుచి సెంట్రల్ నియోజకవర్గాలో విజయ్ పోటీ చేస్తున్నారని, ఇందుకోసం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తి విలువలో తేడాలు ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఆదిత్య బిర్లా జ్యువెలరీకి చెందిన ఇంద్రియ, తన వినియోగదారులతో తన ఉనికిని, అనుబంధాన్ని బలోపేతం చేసుకునే వ్యూహాత్మక ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా, అక్షయ తృతీయ 2026 ప్రచారంతో ప్రారంభించి, ప్రఖ్యాత నటి కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. సాంస్కృతిక ప్రామాణికతలో పెనవేసుకుపోయిన తన సమకాలీన ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన కృతి శెట్టి, ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ, సంప్రదాయంతో గాఢంగా ముడిపడి ఉన్న ఆధునిక ఇంద్రియ మహిళకు ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ఆమె ఈ బ్రాండ్కు సహజ ఎంపికగా నిలిచింది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ‘33 టెంపుల్ రోడ్’ అనే గ్రిప్పింగ్ ట్యాగ్లైన్తో ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.
గుండెకి సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ (శివ) కు 10.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్. అంతేకాకుండా అపోలో ఆసుపత్రిలో వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు.
సినీ నటి పూనమ్ కౌర్ సోమవారం వేములవాడను సందర్శించి, భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, కోడె మొక్కును సమర్పించారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ, దైవాశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
పెళ్లికి కేవలం మూడు రోజుల ముందు కాబోయే వరుడు మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన చిన్న శంకరంపేట మండలం, అంబాజీపేట గ్రామంలో చోటుచేసుకుంది. జంగరై నివాసి అయిన వరప్రసాద్ (30), పెళ్లి పత్రికలు పంచడానికి అంబాజీపేటకు వెళ్తుండగా, ఒక వీధి కుక్క అతని దారికి అడ్డంగా వచ్చింది. కుక్కను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో, అతను తన ద్విచక్ర వాహనాన్ని పక్కకు తిప్పగా, అది రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ పాత్రలు హైలెట్ కానున్నాయని సమాచారం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తి కలిిగించాయి.
హైదరాబాద్: ది లీలా బ్రాండ్ యొక్క జాతీయ రోడ్షో, ది లీలా మొజాయిక్ 2026లో భాగంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఆతిధ్యం ఇస్తూ ది లీలా హైదరాబాద్ తమ విశిష్ట విందు వేదిక అయిన ఇస్ఫాహాన్ ద్వారాలను తెరిచింది. భారతదేశంలోని కీలక వ్యాపార నగరాలలో విస్తరించి ఉన్న ది లీలా మొజాయిక్ 2026 ఏప్రిల్ సర్క్యూట్ లో ఇది మూడవ మజిలీ. ఈ ఎడిషన్, కార్పొరేట్ క్లయింట్లు, మైస్ ప్లానర్లు, సీనియర్ వ్యాపార భాగస్వాములు, ఈవెంట్ ప్లానర్లు, వెడ్డింగ్ పార్టనర్స్ , ట్రావెల్ ఏజెంట్లు, హాస్పిటాలిటీ భాగస్వాములను ఒకచోట చేర్చింది.
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకపర్తి సరస్సులో డెవిల్ ఫిష్ మూక మత్స్యకారులను బెంబేలెత్తిస్తున్నాయి. చేపలు పట్టేందుకు సరసులో వలలు వేస్తుంటే ఆ వలల్ని ముక్కముక్కలుగా కొరికేస్తున్నాయి. మరోవైపు ఇతర చేపలను తినేస్తున్నాయి. దీనితో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చేపలు పట్టేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సరసులో చేపల వేటకు వెళితే రాకాసి చేపలు దొరుకుతున్నాయి. 3 నుంచి 4 టన్నులు వరకూ ఈ చేపలే పడుతున్నాయి. 100 కుటుంబాలు ఈ చేపల వేట మీద ఆధారపడి వున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హర్మూజ్ జలసంధిలో రెండు భారత్ నౌకలపై కాల్పులు జరిపిన వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించినట్టు ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. తమ దళాలేనా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి ఒక ప్రకటన చేశారు. 'మా దళాలే భారత నౌకలను లక్ష్యంగా చేసుకొన్నాయా..? అనే అంశంపై సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయి' అని పేర్కొన్నారు.
కేవలం వంద రూపాయలు అప్పు ఇవ్వలేదనే కారణంతో జరిపిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి తన ఇంటి వద్దే ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుకాణం వద్దకు వచ్చి, తనకు అత్యవసరంగా 100 రూపాయల అప్పు కావాలని శంకరయ్యను కోరాడు. అయితే, గతంలో ఉన్న బకాయిలు లేదా ఇతర కారణాల రీత్యా శంకరయ్య అప్పు ఇచ్చేందుకు నిరాకరించాడు.
ఉత్తర జపాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై రూ.7.4గా నమోదైంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగసి పడొచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది.
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం అగధ. మహాదేవి పాత్ర పరిచయం ఈ మర్మమైన, దైవిక థ్రిల్లర్కు కొత్త ఉత్కంఠను జోడిస్తుంది. మునుపటి పోస్టర్లో దైవ విగ్రహం ముందు నిలబడి కనిపించిన ఆ రహస్య యువతి మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల అని చిత్ర నిర్మాతలు అధికారికంగా నేడు ప్రకటించారు. ఆమె ఈ చిత్రంలో కీలక కథానాయిక మహాదేవి పాత్రను పోషిస్తున్నారు.
తమ కంపెనీ మొబైల్ వినియోగదారులపై ఎయిర్టెల్ మరోమారు భారం మోపింది. 84 రోజులు కాలపరిమితో కలిగిన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచేసింది. రూ.859 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.899కి పెంచేసింది. ఈ పెంపుపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది. దీంతో ఈ ప్లాన్ను రెగ్యులర్గా రీచార్జ్ చేసుకునే వినియోగదారులపై రూ.40 అదనపు భారం మోపింది. సవరించిన ప్లాన్లో ఎలాంటి అదనపు ప్రయోజనాలను కల్పించకపోవడం గమనార్హం.
సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో పిఠాపురంలో … అలా మొదలైంది’ మూవీ రూపుదిద్దుకుంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాని మే 1న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సు
మహిళా బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, డీఎంకేలు అడ్డుకుని దక్షిణ భారతదేశానికి తీరని నష్టం చేశాయని ఏపీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర శానసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. దీనికి నిదర్శనమే ఎంజీఆర్, ఎన్టీఆర్లు తెలుగు గంగా ప్రాజెక్టు అమల్లోకి తెచ్చి తమిళనాడు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీరుస్తున్నారన్నారు.
జమ్మూకాశ్మీ రాష్ట్రంలోని ఉధంపూర్ మార్గంలో వెలుతున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి ఓ లోయలో పడిపోయింది. ఈ విషాదకర ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాతపడగా, మరికొందరు గాయపకడ్డారు. రామ్ నగర్ నుంచి ఉధంపూర్ వెళుతుండగా మధ్యలో జూలో అనే ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉధంపూర్ శవకుమార్ శర్మ పేర్కొన్నారు.
మంచిర్యాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తె సరిగా చదవడం లేదని, మాట వినడం లేదనే సాకుతో ఆమెను బైక్పై ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. తండ్రి కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక ఆ పసిపాప కేకలు వేస్తూ విలవిలలాడిపోయింది.
కోలీవుడ్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ విడాకుల కేసు మరోమారు వాయిదాపడింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో కోర్టులో ప్రత్యక్షంగా కాకుండా జూమ్లో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని విజయ్ తరపు న్యాయవారి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి శశికళ జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వారిద్దరూ కోర్టుకు నేరుగా హాజరుకావాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం సుసంపన్నం, అభివృద్ధి పథంలో పయనించేలా నడిపించేందుకు అవసరమైన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, నిరంతర శక్తి లభించాలని గవర్నర్తో పాట వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
అమెరికా రక్షణ వ్యవస్థ విఫలమైంది. రూ.లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసి అమెరికా నుంచి సమకూర్చుకున్న ఆయుధాలు సమయానికి పని చేయడం లేదు. అదేసమయంలో ఇరాన్ తమపై భీకర దాడులు చేస్తూ తమ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు భయంతో వణకిపోతున్నాయి. ఈ పరిస్థితి దేశాల రక్షణ శాఖల్లో ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాదులో ఆహారం కల్తీకి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ. ముత్యం రెడ్డి, ఆదివారం నాడు ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు, ఆయనకు పాడైపోయిన, చెడిపోయిన మటన్ కీమా కూర లభించింది. జూబ్లీ హిల్స్, రోడ్ నెం. 46లో ఉన్న తెలుగు మీడియం రెస్టారెంట్ నుండి ఈ ఆహారాన్ని ఆర్డర్ చేశారు. పార్శిల్ అందుకున్న తర్వాత, దానిని తెరిచిన కొద్ది నిమిషాలకే అందులో నుండి దుర్వాసన రావడంతో, ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదకర ఘటన జరిగింది. స్థానిక వావిలాల నగర్లో గోవర్థన (40) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలను పరిశీలిస్తే, గోవర్థన స్థానికంగా ఉన్న ఒక క్లినిక్లో నర్సుగా పని చేస్తున్నారు. అయితే, ఆమె పని చేస్తున్న క్లినిక్లోని ఆర్ఎంపీ వైద్యుడు ఆమెపై చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
కొండపల్లి బొమ్మల పండుగ, ఆ ప్రాంతానికి చెందిన 400 ఏళ్ల నాటి కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడం, కళాకారులకు అండగా నిలవడం లక్ష్యంగా, ఆ కళకు ఒక నూతన ఉత్సాహాన్ని అందించింది. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో భాగంగా, ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ వారసత్వ కార్నివాల్ కార్యక్రమం విశేష జనసందోహాన్ని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. నగరం నడిబొడ్డున కోట్లు ఖర్చు చేసి వేసిన ఒక భారీ సెట్లో ప్రస్తుతం ఒక అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ను రంగంలోకి దించారు. రాజమౌళి గ్రాండియర్, మహేశ్బాబు గ్రేస్, బాస్కో స్టెప్పులు కలిస్తే థియేటర్లో విజువల్ ఫీస్ట్ పక్కా అనిపిస్తోంది.
కర్నూలు జిల్లాలోని యెమ్మిగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు రామన్న, ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో ఉన్న తన భార్య నరసమ్మపై కత్తితో దాడి చేశాడు. యెమ్మిగనూరు వాసులైన ఈ దంపతులు, కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నట్లు తెలిసింది.
తమిళనాడులోని వాచకారపట్టిలో ఉన్న ఒక ప్రైవేట్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో, కనీసం 23మంది సజీవ దహనమయ్యారని, మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. కట్టనార్పట్టిలోని, ముత్తుమాణిక్యం అనే వ్యక్తికి చెందిన వనజ బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం వాచకారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అధికారుల ప్రకారం, గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
1991 గల్ఫ్ యుద్ధ కాలంలో తమిళనాడులో ఏర్పడిన చమురు సంక్షోభం నేపథ్యంలో సాగే ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ 'కారా' రెండు నిమిషాల ట్రైలర్ విడుదలైంది. ఇందులో, అతని పాత్ర కరసామి—ఒకప్పుడు బ్యాంకు దొంగగా ఉండి, మారిన వ్యక్తి—పెరుగుతున్న ఇంధన ధరలు, అవినీతి మధ్య తిరిగి నేరాల వైపు మళ్లడం, అదే సమయంలో కనికరం లేని ఒక పోలీస్ అధికారి అతడిని వెంబడించడం కనిపిస్తుంది.
పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రశాంత వాతావరణం కనిపించినప్పటికీ తాజాగా అమెరికా చేసిన పనికి ఈ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తమ వాణిజ్య నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా ఆ దేశ యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్టు టెహ్రాన్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న కాల్పుల విరమణ ముక్కలైపోయింది.
పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్మెంట్, ‘మహావతార్’ సినీమాటిక్ యూనివర్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం, పరశురాముడి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించనుంది. పురాణ గాథలతో పాటు ఆధునిక విజువల్ టెక్నాలజీని కలిపి ఒక కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఆయనకు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కోవలోనే జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 76వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన వైకాపా కార్యకర్త దస్తగిరి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ వివాదం కారణంగా దస్తగిరిని వైకాపా నేతలే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిర్దారణ అయింది. పైగా, ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించి పోలీస్ ఉన్నతాధికారులపై జిల్లా ఎస్పీ సస్పెండ్ వేటు వేసి వీఆర్కు పంపించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్: ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, FZ-S Fi హైబ్రిడ్ మోటార్ సైకిల్తో పాటు 125cc Fi హైబ్రిడ్ స్కూటర్లు, ఫాసినో Fi మరియు RayZR 125 Fi కోసం హైదరాబాద్లో మెగా మైలేజ్ ఛాలెంజ్ను నిర్వహించింది. స్మార్ట్ మోటార్ జనరేటర్(SMG) వ్యవస్థతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీ అందించే ఆకట్టుకునే ఇంధన సామర్థ్యం, దాని ప్రయోజనాలపై వినియోగదారుల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అగ్రశ్రేణి యమహా బ్లూ స్క్వేర్ డీలర్షిప్ల సహకారంతో నిర్వహించిన ఈ ఛాలెంజ్లో, యమహా కస్టమర్లు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటారని కంపెనీ వెల్లడించింది.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదంఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి చికాకుపడతారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి.