Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవాలయాల్లో రిజర్వేషన్.. సీఎం జగన్ సంచలనం (Video)

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (16:05 IST)
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టంలో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం నామినేటెడ్ సభ్యుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవులు (కార్పొరేషన్లు, వివిధ ట్రస్ట్ బోర్డులు, వ్యవసాయ మార్కెట్లు), కాంట్రాక్టుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్‌లో తీర్మానించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో వైకాపా దమనకాండ : డీజీపీకి బాబు సుధీర్ఘ లేఖ