Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా దేశం విడిచి వెళ్లిపోండి... అమెరికాలో తెలుగువారిపై కాల్పులు... ఒకరు మృతి

అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందా.. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న విధానాల కారణంగా ఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయని అనుకోవాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమెరికాలోని కన్సాస్ సిటి బార్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీ

Advertiesment
Indian-American Telugu engineer
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (12:25 IST)
అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందా.. అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న విధానాల కారణంగా ఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయని అనుకోవాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమెరికాలోని కన్సాస్ సిటి బార్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాసరావు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్‌ పైన దుండగుడు కాల్పులకు తెగబడుతున్నప్పుడు అతడిని రక్షించేందుకు అమెరికా యువకుడు చేసిన ప్రయత్నాల్లో తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే చికిత్స తీసుకుంటూనే అతడు కన్నుమూశాడు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కూచిభొట్ల శ్రీనివాస్, ఆలోక్‌లు జీపీఎస్ మేకర్ గార్మిన్‌లో ఇంజినీర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగువారిపై జరిగిన కాల్పుల ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలోని తెలుగువారిపై దుండగులు కాల్పులు జరపడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రింగింగ్ బెల్స్ డైరక్టర్ మోహిత్ గోయల్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?