Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నదాత సుఖీభవ... చలించిపోయిన ఎమ్మెల్యే రోజా(ఫోటోలు)

Advertiesment
Meals
, శనివారం, 1 డిశెంబరు 2018 (14:56 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించిన నాలుగు రూపాయలకే భోజనం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రోజా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీన రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేవలం 4 రూపాయలకే కడుపు నిండా భోజనం సదుపాయాన్ని కల్పిస్తూ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌కు పోటీగా ఈ 4 రూపాయలకే భోజనం కార్యక్రమం అంటూ విమర్శలు వచ్చాయి. అయితే రోజా అదంతా పట్టించుకోకుండా నిరుపేదల కోసం భోజనాన్ని నిరంతరం అందిస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించిన రోజా స్వయంగా మొబైల్ వ్యాన్ దగ్గరకు నిరుపేదలకు తన చేత్తో భోజనాన్ని వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
Meals
 
కొంతమంది వద్ద 4 రూపాయలు కూడా లేకపోవడంతో చలించిపోయిన రోజా స్వయంగా అన్నం ప్లేటు చేతిలో పెట్టి ఒక్కసారి రుచి  చూడండి.. మళ్ళీ మర్చిపోరంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటోంది రోజా. అన్నం తిన్నవారంతా అన్నదాత సుఖీభవ అంటున్నారు. 
Meals

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 యేళ్ళ బాలికపై తండ్రి - కుమారుడు అత్యాచారం...