Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో జగన్‌కు తెలుసు.. నాది గోల్డెన్ లెగ్ : ఆర్కే.రోజా

Advertiesment
RK Roja
, శుక్రవారం, 7 జూన్ 2019 (14:25 IST)
తాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా చెప్పుకొచ్చారు. పైగా, తనకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌ను తాను అడగలేదన్నారు.
 
ఈ నెల 8వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దీంతో అనేక మంది మంత్రి పదవులు తమకు అవకాశం దక్కుతుదంని ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో ఆర్కే రోజా ఒకరు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, నాకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని, ఇప్పటివరకు నాకు మంత్రి పదవి కావాలని నేను సీఎం జగన్మోహన్‌ రెడ్డిని అడగలేదని అన్నారు. నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ఆయనకు తెలుసన్నారు. పైగా తనది నేను ఐరెన్ లెగ్ కాదని.. గోల్డెన్ లెగ్ అని, అందుకే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారాం....!!