Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుర్రలేని ఎమ్మెల్యేలు... బ్యాలెట్ పేపరుపై పేర్లు - సంతకాలు

రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయ

Advertiesment
Presidential Election 2017
, సోమవారం, 17 జులై 2017 (16:01 IST)
రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటును ఎలా వేయాలో కూడా మాక్ పోలింగ్ పేరుతో ప్రజాప్రతినిధులకు రెండుమూడు దఫాలుగా వివరించారు. అయినాసరే మన బుర్రలేని ఎమ్మెల్యేల చెవికెక్కలేదు. 
 
ఈకాలంలో ఏమీ తెలియని నిరక్ష్యరాస్యుడు సైతం ఈవీఎంలలోనే కాకుండా, బ్యాలెట్ పత్రాల ద్వారా కూడా తన ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకుంటున్నాడు. కానీ, ఓటర్లు వేసిన ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఓటును ఎలా వినియోగించుకోవాలో తెలియదనే విషయం సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ద్వారా బహిర్గతమైంది. 
 
తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన ఓటు వేసిన బ్యాలెట్ పత్రం ఎక్కడ వేయాలో తెలియలేదు. బ్యాలెట్ పత్రాన్ని చేతిలో పట్టుకుని.. ఆ సమయానికి పోలింగ్ కేంద్రంలో ఉన్న మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్లి బ్యాలెట్ పత్రం ఎక్కడ వేయాలంటూ అడగడంతో ఆయన ఆశ్చర్యపోయారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే... బ్యాలెట్ పత్రాలపై తమ పేర్లు రాయడమే కాకుండా, ఏకంగా సంతకాలు కూడా చేశారట. వీరిలో జితేందర్ గౌడ్, కదిరి బాబూరావులు ఉన్నారట. వీరిద్దరూ బ్యాలెట్ పేపరుపై ఒకటో నంబరు వేయడంతో పాటు.. తమ పేరు కూడా రాశారట. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఆ ఇద్దరికి క్లాస్ పీకినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు ఈ ఓట్లు చెల్లుతాయో లేదో తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని సచిన్ - నటి రేఖ