Publish Date: Sat, 18 Jul 2020 (20:53 IST)
Updated Date: Sat, 18 Jul 2020 (20:55 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పదవిలో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్కుమార్ సింఘాల్ డిప్యుటేషన్పై వచ్చారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా పని చేశారు.
టీటీడీ ఈవో కాలపరిమితి రెండేళ్లు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన డిప్యుటేషన్ను మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు తాజాగా రెండోసారి డిప్యుటేషన్ను పొడిగించారు.
మరోవైపు తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా అనిల్కుమార్ సింఘాల్పై విమర్శలు గుప్పిస్తున్న విషయం విధితమే.