Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

Advertiesment
Amaravathi

సెల్వి

, గురువారం, 23 అక్టోబరు 2025 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలి విడత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు 800 మిలియన్ డాలర్లు సాయం అందించనుంది. ఈ ఏడాది చివరి నాటికి రెండవ విడత 200 మిలియన్ డాలర్లను చెల్లించనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు. 
 
అమరావతి రాజధాని నగర తొలి విడత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఒక్కొక్కటి 800 మిలియన్ డాలర్లు, మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) నిధులు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాయి. 
 
అదనంగా, కేంద్రం తొలి విడత అభివృద్ధి కోసం 15వేల కోట్ల రూపాయలలో 14వేల కోట్ల రూపాయలు నిధులు సమకూరుస్తుంది. ప్రపంచ బ్యాంకు తన నిబద్ధతలో భాగంగా ఇప్పటికే 207 మిలియన్ డాలర్లను విడుదల చేసిందని, అందులో దాదాపు 50 శాతం వివిధ పనులకు ఖర్చు చేసిందని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు