Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ నుంచి ముంబై.. త్వరలో బుల్లెట్ ట్రైయిన్

Advertiesment
Larsen And Toubro
, ఆదివారం, 1 నవంబరు 2020 (15:13 IST)
హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైయిన్ చక్కర్లు కొట్టనుంది. తద్వారా ముంబై ప్రయాణం మరింత సులభతరం కానుంది. హైదరాబాద్‌ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. 
 
దేశంలో హైస్పీడ్‌ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ బిడ్లను కూడా ఆహ్వానించింది. 
 
నవంబర్ 5న ప్రీ బిడ్‌ సమావేశం జరుగనుంది. నవంబర్‌ 11-17 తేదీల్లో టెండర్‌ పత్రాలను స్వీకరించనున్నారు. ఇక నవంబర్ 18న డీపీఆర్‌ తయారీ సంస్థను ఎంపిక చేయనున్నారు. అన్నీ సానుకాలమైతే వచ్చే యేడాది చివరికి పనులు ప్రారంభం కావచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాసా అద్భుతమైన చిత్రం.. గుమ్మడి రసం మాదిరి వుందిగా..!