Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెజిల్‌లో కోవిడ్ వైరస్.. రోజుకు 2వేల మంది మృతి

Advertiesment
Brazil Coronavirus
, గురువారం, 11 మార్చి 2021 (11:06 IST)
బ్రెజిల్‌లో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో రోజూ 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అలాగే కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది బ్రెజిల్. ఇప్పటివరకూ ఈ దేశంలో 2,68,370 మంది చనిపోయారు. బుధవారం ఒక్క రోజే 2,286 మంది కన్నుమూశారు. 
 
పీ1 అని పేరు పెట్టిన కొత్త కరోనావైరస్ రకం వ్యాప్తి వల్ల దేశంలో కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఈ కరోనావైరస్ రకం.. మానాస్ అనే అమెజాన్ నగరంలో పుట్టినట్లు భావిస్తున్నారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటంతో బ్రెజిల్‌లోని పెద్ద నగరాల్లో ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. చాలా ఆస్పత్రులు కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయని దేశంలో ప్రధాన ప్రజారోగ్య కేంద్రం ఫియోక్రజ్ హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సారంగ దరియా పాట వివాదం : క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తాం .. శేఖర్ కమ్ముల