Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 47 వేల పాజిటివ్ కేసులు - కేరళలో 32 వేల కేసులు

Advertiesment
Corona Positive Cases
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:11 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది. ఇందులోభాగంగా, గత 24 గంటల్లో ఏకంగా 47092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఏకంగా 32803 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,28,57,937కి చేరింది. అలాగే, నిన్న 35,181 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 509 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,529 కి పెరిగింది. 
 
ఇకపోతే, ఇప్ప‌టివ‌ర‌కు 3,20,28,825 మంది కోలుకున్నారు. 3,89,583 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న 81,09,244 డోసుల వ్యాక్సిన్ల వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 66,30,37,334 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 32,803 కేసులు న‌మోదు కాగా, 173 మంది ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం చేయాలి : అలహాబాద్ హైకోర్టు