Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంపియన్స్ ట్రోఫీ : మనీష్ పాండేను తొలగించారు.. దినేష్ కార్తీక్‌ను చేర్చారు.. ఎందుకు?

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి ఎంపికైన ఆనందం యువ బ్యాట్స్‌మన్ మనీష్‌ పాండేకు ఎంతో సమయం నిలువలేదు. గాయం కారణంగా అతను ఈ మెగాటోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 15 మందితో కూడిన భారత జట్టులో

Advertiesment
Dinesh Karthik
, శుక్రవారం, 19 మే 2017 (11:28 IST)
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి ఎంపికైన ఆనందం యువ బ్యాట్స్‌మన్ మనీష్‌ పాండేకు ఎంతో సమయం నిలువలేదు. గాయం కారణంగా అతను ఈ మెగాటోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 15 మందితో కూడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ గురువారం ప్రకటించింది. 
 
ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున ఆడిన మనీష్‌ సన్ రైజర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో పక్కటెముకల్లో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. గాయం పెద్దది కావడంతో అతను సీటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పాండే భారత తరపు చివరగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో రెండో టీ-20లో పాల్గొన్నాడు.
 
అయితే, గాయం కారణంగా మనీష్ పాండేను తొలగించి... తమిళనాడు వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు చోటు కల్పించారు. ఐపీఎల్‌-10లో గుజరాత్ లయన్స్ తరపున అతను 14 మ్యచ్‌ల్లో 361 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు విజయ్‌ హజారే ట్రోఫీ, దేవ్‌ధర్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంచరీలు చేసి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దేశవాళీ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న దినేశను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, తొలి మ్యాచ్‌ని జూన్ 4న పాకిస్థాన్‌తో ఆడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండెపగిలిన సన్ రైజర్స్.. ఐపీఎల్ నుంచి ఔట్.. వర్షం నేపథ్యంలో లక్ష్యాన్ని ఛేదించిన గంభీర్ సేన