స్పా సెంటర్ ముసుగులో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. మైనర్ బాలికలు కావాలంటే గంటకు రూ. 7500 చెల్లించాలంటే ఫోన్ ద్వారా విటులకు వల వేస్తున్న స్పా సెంటర్ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ రోహిణిలోని మంగళం ప్యాలెస్ మాల్ క్రిస్టల్ బ్యూటీ స్పాలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మెరుపుదాడి చేసారు. ఈ తనిఖీల్లో ఆరుగురు మైనర్ గర్ల్స్, ఐదుగురురు మహిళలను పోలీసులు రక్షించారు. కాగా స్పా సెంటర్లో పని ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగంలో చేర్చుకున్న తర్వాత వారిని బలవంతంగా వేశ్యా వృత్తిలోకి దించుతున్నట్లు తేలింది. దీనితో స్పా నిర్వహకులపై పోస్కోతో పాటు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.