Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంక్రాంతి పండక్కి రమ్మన్నాడు, భార్య రానన్నందుకు ఉరి వేసుకున్నాడు

Advertiesment
Husband
, శనివారం, 15 జనవరి 2022 (12:36 IST)
నాగర్ కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. తన భార్యను సంక్రాంతి పండుగకు ఇంటికి రావాలంటూ భర్త పిలిచాడు. ఐతే అందుకు భార్య ససేమిరా అని అనడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.

 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూలు పట్టణంలోని రాంనగర్ కాలనీలో 30 ఏళ్ల రాజవర్థన్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఇతడికి పెళ్లైంది. ఐతే గత ఆరు నెలల క్రితం వరకూ వారి సంసారం హాయిగా సాగింది.

 
ఆరు నెలల ముందు ఇరు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి. దీనితో భార్యాభర్తలు తరచూ వాగ్వాదం చేసుకోవడం మొదలైంది. భర్తతో తనకు లాభం లేదని అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఏదో కోపంలో వెళ్లిపోయిందిలే అనుకున్నాడు రాజవర్థన్. కానీ ఆమె పుట్టింటి నుంచి తిరిగి రాకుండా అక్కడే వుండిపోయింది.

 
ఈ సంక్రాంతి పండుగకైనా ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు భర్త. అందుకు అతడి భార్య ససేమిరా అంది. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఎద్దుల‌తో కుమ్ములాట‌... భీమ‌వ‌రంలో లోక‌ల్ జ‌ల్లిక‌ట్టు!