పెసర మెులకలతో పకోడీలా... ఎలా చేయాలో చూద్దాం...
జీర్ణశక్తికి పెంచుటకు మెులకలు చక్కగా పనిచేస్తాయి. వీటి వలన ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించుటకు సహాయపడుతాయి. ఇటువంటి పెసర మె
Publish Date: Mon, 10 Sep 2018 (14:53 IST)
Updated Date: Mon, 10 Sep 2018 (15:07 IST)
జీర్ణశక్తికి పెంచుటకు మెులకలు చక్కగా పనిచేస్తాయి. వీటి వలన ఎంజైముల పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గించుటకు మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక బరువును తగ్గించుటకు సహాయపడుతాయి. ఇటువంటి పెసర మెులకలతో పకోడీలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పెసర మెులకలు - పావు కప్పు
వరిపిండి - 2 స్పూన్స్
పుదీనా తరుగు - కొద్దిగా
వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
అల్లం పేస్ట్ - అర స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
తయారీ విధానం:
ముందుగా మెులకల్ని మిక్సీలో పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిలో పైన తెలిపిన పదార్థాలన్నింటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ పిండిని పకోడీల్లా నూనెలో వేసుకుని ఎర్రని రంగు మారేంతవరకు వేయించుకోవాలి. అంతే... వేడివేడి పకోడీలు రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More