ప్రతిరోజూ శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తీసుకుంటే? ఆకలి నివారణకు?
అల్లాన్ని ఎండబెట్టి తయారుచేసే శొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులుకు శొంఠి అద్భుతమైన ఔషధం. దీనిలో అజీర్తిని పోగొట్టే
Publish Date: Sat, 14 Jul 2018 (11:09 IST)
Updated Date: Mon, 16 Jul 2018 (09:36 IST)
అల్లాన్ని ఎండబెట్టి తయారుచేసే శొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులుకు శొంఠి అద్భుతమైన ఔషధం. దీనిలో అజీర్తిని పోగొట్టే గుణం కూడా ఉంది.
ఈ కాలంలో తరచుగా వర్షంలో తడవడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే టీ లేదా కాఫీ లో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడిలో చిటికెడు బెల్లం ముక్కను కలిపి ప్రతిరోజూ తీసుకుంటే మంచిది.
అలాగే చెంచా శొంఠి పొడిలో చిటికెడు లవంగాల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కప్పు నీటిలో ఆ మిశ్రమాన్ని వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించుటకు సహాయపడుతుంది. వేడి అన్నంలో శొంఠి పొడిలో కాస్త పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పొడిని వేడి పాలలో వేసుకుని చిటికెడు చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. శొంఠి పొడిని నీళ్లల్లో కలిపి పేస్టులా చేసుకుని నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More