Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంచలన నిర్ణయం తీసుకున్న భారత్ - పాకిస్థాన్ సైన్య బలగాలు

Advertiesment
India
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:00 IST)
భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన సైనిక బలగాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి ఇక నుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఈ మధ్య నియంత్రణ రేఖ వెంబడి తరుచూ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
'ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు' అని ఇరు దేశాల అధికారులు తెలిపారు. 
 
ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారం కుదిరినా సరే, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంచింది. అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపకూడదని ఇరు దేశాలు 2003లో ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా... తరుచూ ఈ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉన్న విషయం తెల్సిందే. 
 
ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాకిస్థాన్‌లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్‌లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని రుణ పథకం పేరుతో ఘరానా మోసం : రూ.4 కోట్లను స్వాహా చేసిన గ్యాంగ్