Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయ్.. బలూచిస్తాన్ వెనకబడిపోయింది: ఉద్యమకారులు

బలూచిస్తాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ సైన్యం వైదొలగాలని బలూచీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆగడాలను రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో

Advertiesment
Pakistan
, గురువారం, 13 అక్టోబరు 2016 (12:14 IST)
బలూచిస్తాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ సైన్యం వైదొలగాలని బలూచీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆగడాలను రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రవాస బలూచీలు లండన్ నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారికి ఆక్రమిత కాశ్మీర్ నుంచి ప్రవాసం వెళ్లినవారు కూడా తోడయ్యారు. పాక్‌ సర్కారు ఆ రెండు ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. 
 
హంతకులు ఎంతటివారైనాసరే వారిని అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బలూచీ ఉద్యమకారిణి మీడియాతో మాట్లాడుతూ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి సేనలను ఉపసంహరించుకోవాలని పాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. బలూచిస్తాన్‌లో ఉద్యమకారులను అరెస్టు చేస్తున్నారని, బాబా జాన్‌తోపాటు ఆయన అనుచరులకు 40 ఏళ్లు జైలు శిక్ష విధించారని వెల్లడించారు. పాకిస్తాన్ పాలనలో బలూచిస్తాన్ బాగా వెనుకబడిపోయిందని ఉద్యమకారులు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌పై దండయాత్ర చేసేందుకు అనుమతివ్వండి : జైషే మొహ్మద్ చీఫ్