Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీపై గెలిస్తే... ముంబైతో ఫైనల్ సమరం.. చెన్నైకింగ్స్‌కు అదృష్టం కలిసొస్తుందా? (video)

Advertiesment
IPL 2019
, శుక్రవారం, 10 మే 2019 (12:23 IST)
రెండే నిమిషాల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఆదివారం హైదరాబాదులో జరుగనున్న ఐపీఎల్ ఫైనల్ పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం రెండంటే రెండే నిమిషాల్లోనే అన్నీ టిక్కెట్లను కొనుగోలు చేసేశారు. అదీ ఆన్‌లైన్‌లో ఐపీఎల్ ఫైనల్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 
 
ఐపీఎల్ లీగ్ పోటీలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ప్లే ఆఫ్ పోటీ జరుగనుంది. ఈ పోటీలో గెలిచే జట్టు ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ పోటీకి సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో శరవేగంగా అమ్ముడుపోయాయి. దీంతో టిక్కెట్లు పొందలేని క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 
 
ఇకపోతే.. ఒక నెలపాటు జరుగుతున్న ఐపీఎల్ పోటీలు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. ఐపీఎల్ ఉత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై-ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తేనే ముంబైతో ఫైనల్లో తలపడే అవకాశాన్ని చేజిక్కించుకుంటుంది. లేకుంటే ఇంటికి పోవాల్సిందే. చెన్నైకి ధోనీ వుండటం ప్లస్ అయినా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు చేతులెత్తేయడం కలిసిరాలేదు. 
 
ఇప్పటి వరకు చెన్నై కింగ్స్- ఢిల్లీ జట్లు 19 సార్లు ఐపీఎల్‌లో తలపడ్డాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో చెన్నై గెలుపును నమోదు చేసుకోగా, ఢిల్లీ ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాన్ని సాధించుకుంది. అయినా ఐపీఎల్‌లో ఆటకు అదృష్టం కూడా తోడవ్వాలి. మరి ఈసారి ప్లేఆఫ్‌లో అదృష్టం చెన్నైకి దక్కుతుందా.. లేకుంటే ఢిల్లీకి దక్కుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ సేన ప్రపంచ కప్ గెలుస్తుందా? లేదా? కపిల్ దేవ్ ఏమన్నారు?