Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ అదుర్స్.. సత్య నాదెళ్లకు భారీ ఇంక్రిమెంట్

Advertiesment
Satya Nadella
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఇందుకు కారణం తెలుగువాడైన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడమేనని తెలుస్తోంది. ఆయన సీఈవో అయినప్పటి నుంచి ఆ సంస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ.. లాభాలను ఆర్జిస్తోంది.

ఈ నేపథ్యంలో సత్య నాదెళ్లకు భారీగా ఇంక్రిమెంట్ లభించింది. ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఏకంగా 66 శాతం ఇంక్రిమెంట్ లభించింది. 
 
మైక్రోసాఫ్ట్ వార్షిక నివేదికను అనుసరించి 2018-19 సంవత్సరానికి సత్య నాదెళ్లకు 42.9 మిలియన్ డాలర్ల వేతనం లభించింది. గడిచిన రెండేళ్లలో ఆయన వేతనం రెండింతలైనట్లు తెలుస్తోంది. 2016-17కు గానూ ఆయన 20 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకోగా.. 2017-18కి 25 మిలియన్ డాలర్లు అందుకున్నారు. 
 
సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరుణంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 302 బిలియన్ డాలర్లు ప్రస్తుతం 850 మిలియన్ డాలర్లకు చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా శరద్ అర్వింద్ బాబ్డే.. సిఫార్సు చేసిన సీజేఐ