Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

Advertiesment
Karnataka crime

సెల్వి

, మంగళవారం, 18 నవంబరు 2025 (13:33 IST)
Karnataka crime
మహిళా హోం గార్డుపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులకు ఆ మహిళ ఐదువేలు ఇవ్వాలని రమ్మని చెప్పి.. ఆమెను బైకుపై తీసుకెళ్లి జ్యూస్‌లో మద్యం కలిపారు. తర్వాత నలుగురు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటన కర్ణాటక, కొప్పళ జిల్లా యెల్బుర్గా తాలూకా మాద్లూర్ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వెళ్లిన హోంగార్డు మహిళపై ఈ అకృత్యం జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
ప్రస్తుతం ఆ మహిళ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు