Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ వాహనాలకు చెక్.. ఇకపై అధికారులకు ట్యాక్సీలే అద్దె వాహనాలు.. కేంద్ర నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లే

Advertiesment
Vigilance commission
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ అధికారులంతా ఇకపై ట్యాక్సీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వాహనాలను వినియోగించడానికి వీల్లేకుండా ఆదేశాలను జారీ చేయనుంది. పైగా, ఈ రిజిస్టర్ ట్యాక్సీలనే అద్దె వాహనాలుగా పరిగణించనుంది. 
 
అనేక అధికారులు ప్రభుత్వ సొమ్ముతో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసిన వాటిలో తిరగుతుంటారు. మరికొంతమంది ప్రభుత్వ అధికారులు వారి కుటుంబసభ్యులు.. బంధువుల పేరుమీద విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసి వాటినే అధికారిక వాహనాలుగా లీజుకు తీసుకుంటున్నారు. ఈ విషయం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ నిగ్గు తేల్చింది. దీనిపై ఓ నివేదికను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సమర్పించింది.
 
దీంతో ఇకపై అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన కార్లను కాకుండా.. కేవలం ట్యాక్సీగా రిజిస్టర్‌ అయిన కార్లనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. అంతేకాదు.. ట్యాక్సీ ఎంత దూరం ప్రయాణించింది.. ఏ పనిపై తీసుకుకెళ్లారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్మోహన్ రావును జయకు పరిచయం చేసింది రోశయ్యా? ఐటీ అడుగుతుందా?