Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టాలపై పశువులు.. సడెన్ బ్రేక్ వేసిన డ్రైవర్.. వెనక్కి వెళ్లిన రైలు.. ఎలా?

Advertiesment
Purnagiri Jan Shatabdi Train
, గురువారం, 18 మార్చి 2021 (14:24 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై పశువులు కనిపించడంతో డ్రవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఈ కారణంగా రైలింజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైలు ఏకంగా 35 కిలోమీటర్ల దూరం వెనక్కి (రివర్స్)లో వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరస్ అయింది.
 
గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన‌ పూర్ణ‌గిరి జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉత్త‌రాఖండ్‌లోని త‌న‌క్‌పూర్ జిల్లా మీదుగా వెళ్తున్న స‌మ‌యంలో  ట్రాక్‌పైకి ప‌శువులు రావ‌డాన్ని గుర్తించిన‌ లోకో పైల‌ట్ (డ్రైవర్) స‌డెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య తలెత్తింది. 
 
పైగా, రైలు ఒక్కసారిగా వెన‌క్కి వెళ్ల‌డం ప్రారంభించి, అలా 35 కిలోమీట‌ర్లు వెళ్లి ఖాతిమా ద‌గ్గ‌ర నిలిచిపోయింది. ఆ స‌మ‌యంలో అది చాలా వేగంగా వెళ్లింది. ఇది వీడియో కనిపిస్తోంది. ఇంజిన్‌పై లోకోపైల‌ట్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోయాడు. 
 
రైలు ఆగిన అనంత‌రం ప్ర‌యాణికుల‌ను కిందికి దించి ఖాతిమా నుంచి బ‌స్సుల ద్వారా త‌న‌క్‌పూర్‌కు పంపారు. ఆ రైలు న‌డిపిన‌ లోకోపైల‌ట్‌, గార్డ్‌ల‌పై అధికారులు స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి 500 క్యాలరీలు ఖర్చు చేశాడని తెలిసి బ్రేకప్ చెప్పిన ప్రేయసి, ఏం జరిగింది?