Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పంజా... ఏడుగురు మృతి

గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్

Advertiesment
Terrorist attack on Amarnath piligrims
, సోమవారం, 10 జులై 2017 (23:35 IST)
గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. 
 
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సులో వెళ్తున్న అమర్ నాథ్ యాత్రికులకు బుల్లెట్లు తగిలాయి. దీనితో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాత్రికులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా సమాచారం. మెరుపుదాడి చేసి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రభుత్వ పథకాలపై నిఘా కన్ను...