చేపల పకోడీలు తయారీ విధానం...
వారానికి రెండు సార్లు చేపలను తింటే దాంతో డయాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్న
Publish Date: Mon, 18 Jun 2018 (14:20 IST)
Updated Date: Mon, 18 Jun 2018 (19:54 IST)
వారానికి రెండు సార్లు చేపలను తింటే దాంతో డయాబెటిస్ దూరం అవుతుంది. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింటే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - 2 కప్పులు
కోడిగుడ్లు - 3
కార్న్ఫ్లోర్ - 3 స్పూన్స్
కారం - 2 స్పూన్స్
కొత్తిమీర - 1 కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
తయారు చేసే విధానం :
ముందుగా కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కార్న్ఫ్లోర్ వేసి మరికాసేపు కలపాలి. ఆ మిశ్రమంలో శుభ్రం చేసి ఉంచిన చేప ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద బాణలిని పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. అంతే... వేడి వేడి చేపల పకోడీలు రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More