ప్రతిరోజూ తులసి మెుక్కను పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
తులసి మెుక్క దేవలోక పారిజాతంగా చెబుతుంటారు. అందువలనే ప్రతి ఇంటి ప్రాంగణంలో తులసి మెుక్క కనిపిస్తుంటుంది. తులసి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణువు, చివరిలో శివుడు ఉంటారని చెబుతుంటారు. తులసిని లక్ష్మీ
Publish Date: Thu, 23 Aug 2018 (10:42 IST)
Updated Date: Thu, 23 Aug 2018 (17:04 IST)
తులసి మెుక్క దేవలోక పారిజాతంగా చెబుతుంటారు. అందువలనే ప్రతి ఇంటి ప్రాంగణంలో తులసి మెుక్క కనిపిస్తుంటుంది. తులసి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణువు, చివరిలో శివుడు ఉంటారని చెబుతుంటారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తుంటారు. అందువలన తులసి ఆకులతో శ్రీమన్నారాయణుని పూజిస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడని చెప్తుంటారు.
సాక్షాత్తు లక్ష్మీనారాయణులు తులసి మెుక్కలో నివాసంగా ఉంటారని విశ్వసిస్తుంటారు. అందువలన ఉదయాన్నే తులసి మెుక్కను పూజించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడుతోంది. అంతేకాకుండా సాయంత్రం వేళలో తులసి కోటలో దీపం పెట్టాలి. ఈ మెుక్క పై నుండి వచ్చే గాలిని పీల్చుకోవడం వలన ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవని అంటారు.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More