Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనుమంతుడు అక్కడే వుంటాడు

Advertiesment
Lord Hanuman
యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. అంటే, ఎక్కడెక్కడ రామ నామ సంకీర్తనం జరుగుతుందో, అక్కడ హనుమంతుడు రెండు చేతులు జోడించి, ఆనంద బాష్పాలతో మైమరిచి కూర్చుని ఉంటాడట. అందుకే ప్రతి రామ భక్తుడి హృదయంలో ఆంజనేయుడు కొలువై ఉంటాడు. 
 
శ్రీరాముడు వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుడిని భూమిపైనే ఉండి ధర్మాన్ని రక్షించమని కోరాడు. అప్పటి నుండి హనుమయ్య హిమాలయాలలోని గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటూ నివసిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ కొందరు యోగులకు అక్కడ ఆయన దర్శనం కలుగుతుందని చెబుతుంటారు.
 
ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు, హనుమంతుడు అర్జునుడి రథంపై ఉన్న జెండా మీద నివసించాడు. అందుకే ఆ రథాన్ని 'కపిధ్వజం' అంటారు. యుద్ధం మొత్తం పాండవులకు రక్షణ కవచంలా ఉండి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రావణ సంహారం తర్వాత విభీషణుడు లంకకు రాజయ్యాడు. పరమ రామ భక్తుడైన విభీషణుడికి తోడుగా ఉంటూ, రామకథను ప్రచారం చేస్తూ కొంతకాలం లంకలో కూడా హనుమంతుడు నివసించారని పురాణాలు చెబుతున్నాయి.
 
ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే నిజాయితీ, నిస్వార్థ సేవ ఉంటాయో అక్కడ హనుమంతుడు ఉంటాడు. మనం "హనుమాన్ చాలీసా" పఠించినప్పుడు మనలో కలిగే ఆ అపారమైన ఆత్మవిశ్వాసమే హనుమంతుడి ఉనికికి నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాముడు లేని చోట హనుమంతుడు ఉండడు.. హనుమంతుడు లేని చోట విజయం ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vibhuvana Sankashti 2026: విభువన సంకష్టి చతుర్థి.. గరిక, బిల్వ పత్రాలతో పూజిస్తే?