Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

Advertiesment
TTD Special Entry Darshan
శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుక్రవారం జారీచేయనుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రోజుకు 20 వేల చొప్పున మొత్తం 6.20 లక్షల టిక్కెట్లను విుడదల చేయనుంది. అలాగే 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు సర్వదర్శనం టోకెన్లను కూడా విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, జనవరి 5వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టిక్కెట్లను రోజుకు 5 వేల చొప్పున మొత్తం 55 వేల టిక్కెట్లను విడుదల చేస్తారు. అలాగే, ప్రతి రోజూ 5 వేల టిక్కెట్లను కూడా తిరుపతిలో జారీచేస్తారు. 31వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్‌‍లైన్ టిక్కెట్లను జారీచేస్తామని, అన్ని రకాల శ్రీవారి దర్శనం టిక్కెట్లను మాత్రం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తామని వెల్లడింతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-12-2021 గురువారం రాశిఫలాలు : కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి... (video)