Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

Advertiesment
tirumala

సెల్వి

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (16:07 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇతర మతాలకు చెందిన సిబ్బంది బదిలీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే టిటిడి ఇతర మతాలకు చెందిన 47 మందిని గుర్తించింది. ఇతర మతాల వారు మత, భక్తి, విద్య విభాగాలలో పనిచేయకూడదని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అయితే, వారు ఇతర విభాగాలలో పని చేయవచ్చు. ఈ నిర్ణయం టీటీడీ చైర్మన్ తొలి బోర్డు సమావేశంలో తీసుకున్నారు. 
 
పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆసుంతా అన్యమత ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆమెపై యాక్షన్ తీసుకున్నారు. త్వరలోనే, ఇతరులను బదిలీ చేస్తారు. ఈ చర్యను హిందూ సంస్థలు స్వాగతించాయి. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఇతర మతాల వారిని టిటిడిలోకి అనుమతించడం గురించి చర్చ కొనసాగుతోంది. 
 
జగన్ మోహన్ రెడ్డి తిరుమల పవిత్రతను చెడగొడుతున్నారని చాలా హిందూ సంస్థలు గగ్గోలు పెట్టాయి. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, వారు ప్రాధాన్యతా ప్రాతిపదికన తిరుమల శుద్ధిని చేపట్టారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం హిందువులు కానివారు ఆలయంలో పని చేయడానికి అనుమతించబడరని టిటిడి బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇతర మతాల వారు స్వచ్ఛందంగా వైదొలగాలి లేదా వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి చేరాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...