Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండగ సీజన్‌లో రద్దీ నివారణ కోసం ప్రత్యేక రైళ్లు

Advertiesment
train

ఠాగూర్

, ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (11:05 IST)
పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికులకు శుభవార్త చెబుతూ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
 
పండగల సమయంలో సాధారణ రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ప్రయాణికుల తాకిడిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పలు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, మధురై-బరౌని మధ్య 12, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-బరౌని మధ్య 12, షాలిమార్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి.
 
అదేవిధంగా, ఎస్ఎంవీటి బెంగళూరు - బీదర్ మధ్య 9, తిరునెల్వేలి - శివమొగ్గ టౌన్ మధ్య 8 సర్వీసులు నడుపనుంది. వీటితో పాటు తిరువనంతపురం నార్త్ - సంత్రాగచి మధ్య 7, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచి మధ్య 3 రైళ్లు కూడా నడుస్తాయని అధికారులు వివరించారు. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టేషన్లు, టికెట్ లభ్యత వంటి పూర్తి వివరాల కోసం ప్రయాణికులు రైల్వే అధికారిక వెబ్ సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం - ఏ రాశివారిపై ప్రభావం