Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కా

Advertiesment
Bodiga Shobha
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:31 IST)
ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014 ఏప్రిల్‌లో ఎన్నికల అఫిడవిట్‌లో బొడిగె శోభ ఆస్తుల విలువ రూ.రెండు కోట్ల లోపేనని గుర్తు చేశారు. 
 
అప్పుడు టీవీఎస్‌ బైక్‌, ఇండికా కారు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు వారి ఆస్తులు రూ. 40కోట్ల వరకు చేరాయని ఆరోపించారు. ఈ ఆస్తులు ఆమెకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆమె ఆస్తుల వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి సీబీఐ, ఏసీబీ, కోర్టులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు శోభ ఆస్తుల వివరాలను ఫ్యాక్స్ ద్వారా పంపామని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం... క్విజ్‌లో పాల్గొనండి...