Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి.. 5 నిమిషాల్లో రాజీనామా.. కేసీఆర్ సవాల్

కమీషన్‌ భగీరథ స్కీమ్‌లో ఒక్కటంటే ఒక్క అవినీతి నిరూపిస్తే తన సీఎం పదవికి ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత్రి కేసీఆర్ ప్రకటించారు.

Advertiesment
KCR
, ఆదివారం, 12 మార్చి 2017 (08:16 IST)
కమీషన్‌ భగీరథ స్కీమ్‌లో ఒక్కటంటే ఒక్క అవినీతి నిరూపిస్తే తన సీఎం పదవికి ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చకు శనివారం సీఎం సమాధానమిచ్చారు. 
 
'గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ వాస్తవాలే చెప్పారు. అది మా కేబినెట్‌ ఆమోదించింది. ఒక్క అబద్ధం కూడా లేదు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల హామీ సహా ఏ ఒక్క పదమైనా అతిశయోక్తి అని నిరూపించండి, ఐదే నిమిషాల్లో పదవికి రాజీనామా చేస్తా' అని సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. 
 
‘‘గవర్నర్‌ మాట్లాడుతుంటే.. అరుపులు, పెడబొమ్మలు అవసరమా? రన్నింగ్‌ కామెంట్లు ఎందుకు? 40-50 నిమిషాలు ఓపిక పట్టలేమా?’’ అని విపక్షాన్ని ప్రశ్నించారు. ‘‘ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలకు సిద్ధం. ఎంత సమయమైనా కేటాయిస్తాం. సభ ఔన్నత్యాన్ని కాపాడే విషయంలో రాజీ లేదు’’ అని విపక్ష సభ్యులకు కేసీఆర్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ములాయం సింగ్ కుటుంబ కూకటి వేళ్లను పీకేసిన నరేంద్ర మోడీ...