Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన "యుద్ధం శరణం" ... సినీ కెరీర్‌పై చైతూ డైలమా?

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు, యువ హీరో నాగ చైతన్య అక్కినేని తన సినీ కెరీర్‌పై పునరాలోచనలో పడ్డారు. చైతూ నటించిన తాజా చిత్రం యుద్ధం శరణం చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Advertiesment
yuddham sharanam
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (06:36 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు, యువ హీరో నాగ చైతన్య అక్కినేని తన సినీ కెరీర్‌పై పునరాలోచనలో పడ్డారు. చైతూ నటించిన తాజా చిత్రం యుద్ధం శరణం చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అభిమానుల అంచ‌నాలను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. దీంతో చైతూ ఇప్ప‌డు ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఇందులోభాగంగా, ఇప్ప‌ట్లో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేయాల‌ని భావించడం లేద‌ట. 
 
నిజానికి 'యుద్ధం శరణం' సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి నాగ చైతన్య మూవీ స్టార్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ 'యుద్ధం శ‌ర‌ణం' ఫలితంతో ముందుగా మారుతి సినిమా చేయాలనీ, ఆ తర్వాతనే చందూ మొండేటితో 'సవ్యసాచి' చేయాలని చైతూ భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే 'సవ్యసాచి'  సినిమా యాక్షన్ మూవీగా రూపొంద‌నుండ‌గా, మారుతి చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గాంధీ అంటున్న ఆ స్టార్ హీరో