Publish Date: Thu, 09 Jul 2026 (10:42 IST)
Updated Date: Thu, 09 Jul 2026 (10:54 IST)
తెలుగు నటి స్వాతి రెడ్డి రెండో పెళ్ళి చేసుకున్నారు. తన కెరీర్లో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిన మంత్ ఆఫ్ మధు సినిమా దర్శకుడు శ్రీకాంత్ నగోతితో ఆమె ఏడడుగులు వేశారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం, స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు చేరింది.
ఈ విషయాన్ని స్వాతి స్వయంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వాతికి ఇదివరకే 2018లో వికాస్ వాసు అనే పైలట్తో వివాహం జరిగిన తెలిసిందే. ఆపై వారు విడాకులు తీసుకుని విడిపోయారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More