Publish Date: Fri, 28 Aug 2026 (09:28 IST)
Updated Date: Fri, 28 Aug 2026 (09:35 IST)
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'వారణాసి'. పురాణాలు, ఇతిహాసాల పేరుతో కల్పిక కథతో దర్శకుడు భారీ కథను తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య వారణాసి గ్లింప్స్ ను విడుదల చేశారు. అది మల్టీప్లెక్స్ తో పాటు పలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకులు రానురాను రొటీన్ గా మారిపోయి ఆసక్తి కనిపించడంలేదు. ఎందుకంటే ఇంటర్ వెల్ తర్వాత సెకండాఫ్ కుముందు ఇది ప్రదర్శిస్తున్నారు. దానితో అది ప్లే అయ్యాక లోపలికి రావడం కొన్నిచోట్ల జరుగుతోందని తెలుస్తోంది.
దానితో ఏదో ఒక కొత్త వార్త రూపంలో అప్ డేట్ లు వస్తున్నాయి. ఈసారి ఆఫ్రియన్ లో వుండే డైనోసార్ ల సన్నివేశాలున్నాయని వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించాయి. ఇవి ఊహాగానాలేనా, పబ్లిసిటీలో కొందరు చేసే భాగమా? అని తెలియాల్సి వుంది.
ధృవీకరించని నివేదికల ప్రకారం, 'వారణాసి'లో రుద్ర, మందాకిని ఒక భారీ సన్నివేశం కోసం డైనోసార్ యుగానికి కాలయానం చేస్తారని, ఇది రామాయణ యుద్ధాలు మరియు ప్రపంచవ్యాప్త యాక్షన్తో పాటు ఉత్సాహాన్ని పెంచుతోందని తెలుస్తోంది. ప్రచార పోస్టర్లలో మహేష్ బాబు ప్రాచీన కాలపు దృశ్యాలలో డైనోసార్లతో, ఆఫ్రికన్ సవన్నాలలో, మరియు యోధుల భంగిమలలో కనిపిస్తూ, ఈ చిత్రం పౌరాణిక మరియు అద్భుత దృశ్యాల కలయిక అని సూచిస్తున్నాయి.
కొందరు ఈ 30 నిమిషాల వివరాలను అతిశయోక్తి అని కొట్టిపారేస్తున్నప్పటికీ, రాజమౌళి దర్శకత్వంలో ₹1,400 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ తెలుగు ఇతిహాసం ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి రానుంది. ఇది IMAX థ్రిల్స్ మరియు భావోద్వేగ తండ్రీకొడుకుల బంధాలను అందిస్తుందని వాగ్దానం చేస్తోంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More