Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్... 'స్పైడర్', 'జై లవకుశ'ను దాటేసిన రజినీ 2.0 తెలుగు రైట్స్... ఎంతో తెలుసా?

రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్

Advertiesment
Tollywood talk
, శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:26 IST)
రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఈ మొత్తం మహేష్ బాబు స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కంటే ఎక్కువేనని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. 2.0 చిత్రంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రషెస్ చూసిన బయ్యర్స్ ఎంత రేటుకైనా కొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. చిత్రంలో దమ్ముందనే టాక్ వినిపిస్తోంది. 
 
తెలుగులోనే 75 కోట్లకు అమ్ముడయితే ఇక హిందీ, తమిళం ఇతర భాషల్లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో మరి. పైగా రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో చిత్రం వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఐతే అంతకుముందు వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లండన్ లవర్‌తో శ్రుతిహాసన్.. ఎయిర్‌పోర్టులో కనిపించారు.. సెండాఫ్ ఇచ్చిందా? (Photo)