Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామి-2లో విక్రమ్ సరసన కీర్తి సురేష్.. త్రిష పాత్ర అరగంటేనా?

14 ఏళ్ల క్రితం విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "సామి". ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకున్నారు. కానీ త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో పాట

Advertiesment
Keerthy Suresh
, బుధవారం, 3 మే 2017 (17:11 IST)
14 ఏళ్ల క్రితం విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "సామి". ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకున్నారు. కానీ త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో పాటుగా మోహిని, గర్జనై, 1818, శతురంగ వేట్టై-2, హేయ్ జూడ్, 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో దక్షిణాది హీరోయిన్ అయిన త్రిష చేతినిండా భారీ ఆఫర్లను దక్కించుకోవడంతో ఖుషీ ఖుషీగా ఉంది. 
 
అయితే త్రిషకు సామి-2 సినిమాలో రోల్ పరిమితమేనని తేలింది. ‘నేను శైలజ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేశ్‌ సామి-2కి హీరోయిన్‌గా ఎంపికైంది. ‘సింగం’ సిరీస్‌ చిత్రాల దర్శకుడు హరి.. చియాన్‌ విక్రమ్‌తో కలిసి ‘సామి 2’ తెరకెక్కించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘సామి’కి ఇది సీక్వెల్‌. ఇందులో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 
 
తొలి భాగంలో నటించిన త్రిష ఈ భాగంలోనూ కొనసాగుతుంది. కానీ త్రిష పాత్రకు రెండో భాగంలో అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చునని సమాచారం. అరగంట మాత్రమే త్రిష కనిపిస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నేను లేక‌పోతే నువ్వు బ‌త‌క‌లేవు' అన్నాడు... చివరికిలా : ప్రదీప్ మృతిపై భార్య కామెంట్స్