Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవి కూతురిని చంపేస్తారా..!

వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి తన ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ వెండితెర అరంగేట్రం చేసింది. మరాఠీ మూవీ 'సైరత్' రీమేక్‌తో వెండితెరపై కనిపించనుంది. హిందీలో 'ధడక్' అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుండగా ఇం

Advertiesment
Jhanvi Kapoor
, శుక్రవారం, 17 నవంబరు 2017 (16:48 IST)
వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి తన ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ వెండితెర అరంగేట్రం చేసింది. మరాఠీ మూవీ 'సైరత్' రీమేక్‌తో వెండితెరపై కనిపించనుంది. హిందీలో 'ధడక్' అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుండగా ఇందులో ఇషాన్ ఖట్టర్‌‍కి జాన్వీ జోడీగా నటిస్తోంది. శశాంక్ కైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
 
అయితే 'ధడక్' అనే మూవీ సైరత్ రీమేక్ కాగా ఈ చిత్ర కాన్సెప్ట్ నెగెటివ్ ఎండిగ్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్స్ ఇద్దరిని పరువు పేరిట హీరోయిన్ కుటుంబ సభ్యులు దారుణంగా చంపేస్తారట. మరి తొలి సినిమాలోనే యంగ్ బ్యూటీని చంపేస్తే హిందీ ప్రేక్షకుల రిసీవ్ చేసుకుంటారా? దీనికి శ్రీదేవి ఒప్పుకుందా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
 
అయితే బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు కొన్ని మార్పులు, చేర్పులతో హిందీ వర్షెన్‌ని రూపొందించనున్నారట. 'ధడక్' చిత్రానికి సంబంధించి రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ మూవీపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెంచుతోంది. వచ్చే యేడాది జూలై 6న ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ పోస్ట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైకిలెక్కనున్న జీవితా రాజశేఖర్ దంపతులు