Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీర్తిసురేష్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. అజయ్ కోసం బక్కపలుచగా..?!

Advertiesment
Keerthy Suresh
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (13:33 IST)
మహానటి బయోపిక్‌లో సావిత్రి పాత్రధారిగా కనిపించిన హీరోయిన్ కీర్తిసురేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో నటనకు కీర్తి సురేష్‌ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి సురేష్ ఈ పురస్కారం అందుకోనుంది. 
 
ఈ అవార్డు అందుకోనే లోపే కీర్తి సురేష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓనం పండగ సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీర్తి సురేష్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు ''మిస్ ఇండియా'' చిత్రంలో నటిస్తోంది. 
 
అంతేకాకుండా బోనీ కపూర్ నిర్మాణంలో అజయ్ దేవ్‌గన్ సరసన నటిస్తున్న చిత్రానికి గాను కీర్తి పూర్తిగా మారిపోయింది. దీంతో సన్నగా మారిన కీర్తి ఫోటోస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#CigarAficMag స్మోకింగ్ చేస్తూ ఫోజిచ్చిన నిక్.. ప్రియాంకకు ఆస్తమా వుందంటూ..?