Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిల్కీబ్యూటీతో కలిసి ముంబైలో మెగాస్టార్..!

Advertiesment
Megastar Chiranjeevi
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:38 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటీనటులు నటించారు. 
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా రీసెంట్‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల కోసం ముంబై వెళ్ళారు. త‌మ‌న్నాతో క‌లిసి మీడియా అడిగిన పలు ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానమిచ్చారు.
Megastar Chiranjeevi
 
అంత‌క‌ముందు చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషించిన అమితాబ్‌తో చిరంజీవి కలిశారు. ఆ స‌మ‌యంలో వారితో పాటు ఫర్హాన్‌ అక్తర్ కూడా ఉన్నారు. అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికా ఆప్టే ఫోటోకు సమంత కామెంట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్