Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

Advertiesment
Chiru, Ramcharan family

దేవీ

, మంగళవారం, 6 మే 2025 (12:27 IST)
Chiru, Ramcharan family
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్ వెళుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫొటోకూడా పెట్టారు. ఈ విగ్రహ ఆవిష్కరణ లండన్‌లో  మే 9, 2025న స్థానిక సమయం సాయంత్రం 6:15 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులు అక్కడ సంబరాలకు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.
 
రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'  తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్  అవార్డును కూడా గెలుచుకుంది. గతేడాది రామ్ చరణ్ కు సంబంధించిన కొలతలను కూడా తీసుకున్నారు. తాజాగా ఈ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించనున్నారు.
 
ఇంతకుముందు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువు దీరింది. ఈ మైనపు విగ్రహంలో రామ్ చరణ్ పెంపుడు కుక్క కూడా ఉండటం విశేషం. పెంపుడు పెట్ ను కూడా కొలతలు తీసుకున్నారు. కాగా, ‘గేమ్ చేంజర్’ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్