ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం "శుభం". తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఆమె నటించారు. తాజాగా విడుదలైంది. ఇందులో వర్ధమాన నటీనటులు ప్రధాన పాత్రలను పోషించగా సమంత అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన సమంత తల్లి నినెట్ రుథ్ ప్రభు స్పందించారు. తన తల్లి స్పందనకు సంబంధించిన వీడియోను సమంత ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు.
"నీ నటన చాలా బాగుంది. అలా హావభావాలు పలికించడం కష్టం. సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బా నవ్వుకున్నాను అని నినెట్ వ్యాఖ్యానించారు. తల్లి స్పందనతో పాటు చిత్రంబృందం, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలు, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన దృశ్యాలను కూడా సమంత పంచుకున్నారు. 'శుభం'తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని సమంత ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.