Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంది కడుపున ఏనుగు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?

Advertiesment
Telangana
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణలో తు.చ. తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి కూడా. ఇపుడు తాజాగా... పంది కడుపున ఏనుగు పిల్ల జన్మించింది. ఈ వింత సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామానికి చెందిన రాయపురం సారయ్య అనే వ్యక్తి పందులను పెంచి పోషించేవాడు. ఈ పంది గురువారం ఉదయం ప్రసవించింది. ఇందులో ఓ పిల్ల ఏనుగు ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది. తొండం, దంతాలు, పాదాలు అన్నీ ఏనుగును పోలి ఉన్నాయి.
 
అయితే పుట్టిన కొద్ది క్షణాలకే ఆ వింత ఆకారం గల జంతువు మృతి చెందింది. గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామల ప్రజలు సైతం తండోపతండాలుగా ఆ వింతను చూడటానికి నాయకపల్లి గ్రామానికి తరలి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారంపై ఆమ్నెస్టీ లేదు... అదంతా ఉత్తుత్తి ప్రచారమే...