Publish Date: Thu, 09 Jul 2026 (20:16 IST)
Updated Date: Thu, 09 Jul 2026 (20:17 IST)
ఇటీవలి కాలంలో కొంతమంది చేస్తున్న పనులు సమాజంలో పెరుగుతున్న వింత పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ జంట ఏకంగా రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేను తమ హనీమూన్ గదిగా మార్చుకున్న ఘటన వెలుగుచూసింది.
బలార్ష నుంచి ముంబైకి వచ్చే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో తమకు కావలసిన విధంగా ఓ ఆన్లైన్ డెకరేటర్ని పిలిచి ఏసీ కూపేలో డెకరేట్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ కావడంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైలు బోగీలోకి డెకరేటర్ కి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. టీటీఈపై వేటు వేసింది. ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు.....
Read More