Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..?: పవన్ కల్యాణ్

Advertiesment
Janasena Porata Yatra
, గురువారం, 29 నవంబరు 2018 (14:14 IST)
జ‌న‌సేన పోరాట‌ యాత్ర‌లో భాగంగా బుధ‌వారం రాత్రి తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌వ‌ర్గంలోని మ‌లికిపురంలో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో మలికిపురం జనసంద్రంలా మారింది. చంద్ర‌బాబు నాయుడుని, వేల‌కోట్ల అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకెళ్లొచ్చిన‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవాలా..? 
 
వాళ్లేమైన దేశం కోసం ప్రాణాలర్పించిన భ‌గ‌త్ సింగ్‌లా..? లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..? అని విమర్శించారు. బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదని, హిందీ వాళ్ల పార్టీ అని హిందీకి త‌ప్ప మిగిలిన వారికి విలువ ఉండ‌దన్నారు. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సీట్ల కోసం రాలేదని మార్పు కోసం, ఆత్మ‌గౌర‌వం కోసం, అవినీతిని అంతం చేయ‌డం కోసం వ‌చ్చాడని తూర్పుగోదావని జిల్లాలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిపిస్తే  2019 అవినీతి ర‌హిత జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌"ని హామీ ఇచ్చారు.
Janasena Porata Yatra

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైవ్ మర్డర్... తల్లిని, చెల్లిని చెరిచి చంపేస్తానన్నాడు.. అందుకే చంపేశా