Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లీబిడ్డను మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో తరలించినందుకు మంగోలియా ప్రధాని రాజీనామా

Advertiesment
Mongolia
, శుక్రవారం, 22 జనవరి 2021 (14:23 IST)
మంగోలియా దేశంలో కోవిడ్ సోకిన ఓ నిండు గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను, ఆ నవజాత శిశువును కరోనా ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే బిడ్డతో సహా ఆమెను చికిత్సకు తరలించిన విధానంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మైనస్ 13 డిగ్రీల వాతావరణంలో కేవలం పైజామా ధరించి ఉన్న సమయంలో అలా తరలించడాన్ని నిరసిస్తూ వేలాది మంది రాజధాని ఉలాన్‌బాతర్‌‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంగోలియా ప్రధాన మంత్రి ఖురేల్‌సుఖ్ ఉఖ్నా రాజీనామా చేశారు.
Mongolia
ఆసుపత్రి చీఫ్ కూడా నిష్క్రమించారు. రష్యా, చైనా సరిహద్దుల్లో మంగోలియా దేశం ఉంది. ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో భాగమైన మంగోలియాలో సగానికి పైగా ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల జనాభా ఐదు శాతం కన్నా తక్కువ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: పాకిస్తాన్ ఇంకా ఎందుకు కోవిడ్ వ్యాక్సీన్‌ను కొనుక్కోవడం లేదు?