Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోడీపై కేంద్ర మంత్రి పాశ్వాన్ గుర్రు... ప్రభుత్వం తప్పు చేసింది

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, నేతలు, ఆగ్రహావేవశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఈనెల రెండో తేదీన భారత్‌ బ

Advertiesment
Ram Vilas Paswan
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (14:02 IST)
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, నేతలు, ఆగ్రహావేవశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఈనెల రెండో తేదీన భారత్‌ బంద్‌ను పాటించారు. ఈ బంద్ హింసాత్మకంగా మారడం, పోలీసుల కాల్పుల్లో 12 మంది వరకు దళితులు చనియారు. 
 
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న రాంవిలాశ్ పాశ్వాన్ స్పందించారు. దళితుల అంశంలో కేంద్ర ప్రభుత్వం వైపు తప్పు జరిగిందని అంగీకరించారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల సమాచారం వారిని చేరుకోకముందే నిష్ఫలమైందన్నారు.
 
'ప్రభుత్వ ఉద్దేశ్యమల్లా పౌరులకు సేవ చేయమే. ప్రభుత్వం నుంచి తప్పు జరిగినట్టు మేం ఒప్పుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్నది ఏదైనాగానీ అది ప్రజలకు చేరలేదు' అని వ్యాఖ్యానించారు. అలాగే, 'చట్టం ప్రకారం కోర్టు బెయిల్ మంజూరు చేయకూడదు. అయితే, ఈ చట్టాన్ని కోర్టు ఎలా మారుస్తుంది? సెక్షన్ 18లో మార్పులు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన న్యాయ పరిధిని అతిక్రమించింది' అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక మంత్రి ఆఫీస్‌కు తాళం వేసిన ఐఏఎస్ తెలుగమ్మాయి